English | Telugu

Jayam serial : పెళ్ళికొడుకు నిజస్వరూపం తెలుసుకున్న లక్ష్మీ.. గంగ పెళ్ళి జరుగుతుందా!

జీతెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -27 లో...... గంగ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతాయి. పెళ్లికొడుకుని పిలవడానికి లక్ష్మీ తన గదివైపు వెళ్తుంది. అక్కడ కొంతమంది రౌడీలు అబ్బాయి గురించి మాట్లాడుకుంటారు. ఇది పెళ్లి కాదు ఒక నాటకం ఇదంతా మా సర్ బిజినెస్.. పెళ్లి చేసుకొని అమ్మాయిని దుబాయ్ కి అమ్మేస్తాడనుకుంటారు. అప్పుడే అబ్బాయి వచ్చి ఎవరైనా వింటారు. సైలెంట్ గా ఉండండి అని రౌడీలతో అతను అంటాడు.

అప్పటికే లక్ష్మీ మొత్తం వినేస్తుంది. నాకు ముందు నుండి డౌట్ గానే ఉందని లక్ష్మీ అనుకుంటుంది. లక్ష్మీ వినేసిందని వాళ్ళకి అర్ధమవుతుంది. వెంటనే లక్ష్మీ కాళ్ళు కట్టేసి ఒక రూమ్ లో బంధిస్తారు. ఆ తర్వాత వీరుకి పెళ్ళికొడుకు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. మరొకవైపు గంగ నాకు చాలా దగ్గర అయింది.. తనకి నా తరుపున ఏదైనా ఇవ్వాలని శకుంతల అనుకుంటుంది. తాళిబొట్టు చేతిలో పట్టుకొని గతంలో రుద్రకి కాబోయే భార్యకి ఇవ్వాలని అనుకుంటుంది. గతంలో వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉందని గుర్తుచేసుకుంటుంది.

నిన్ను కన్నకొడుకులాగా చూసుకున్నాను కానీ నువ్వు నా కొడుకు చావుకి కారణం అయ్యావ్.. నిన్ను ప్రేమించిన అమ్మాయిని మోసం చేసావ్.. ఈ తాళి నీకు ఇచ్చే అర్హతని కోల్పోయావ్.. ఇది గంగకి ఇస్తానని శకుంతల అనుకుంటుంది. తాళి, చీర రెడీ చేస్తుంది. మరొకవైపు వీరు, ఇషిక గంగ ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.