English | Telugu

రోహిణితో గొడవ... 'క్యాష్' నుండి వర్ష వాకౌట్!

'జబర్దస్త్'తో రోహిణి, వర్షకు పాపులారిటీ పెరిగింది. రాకింగ్ రాకేష్ స్కిట్స్, హైపర్ ఆది స్కిట్స్ లో రోహిణి చేస్తోంది. మొన్నటివరకు కెవ్వు కార్తీక్ స్కిట్స్ లో చేసిన వర్ష, ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ స్కిట్స్ లో చేస్తోంది. 'ఊరిలో వినాయకుడు' ఈవెంట్ కోసం వర్ష ఇంట్లో చేసిన పూజకు రోహిణి వెళ్ళింది. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బలపడిందని భావిస్తున్న సమయంలో, గొడవలు బయటపడ్డాయి.

సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'క్యాష్' షోకి రోహిణి, వర్ష వచ్చారు. తనను 'బండ... బండ' అని వర్ష పిలవడంతో రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇంకోసారి బండ అన్నావంటే ఎత్తి అలా వేసేస్తాను' అని రోహిణి సీరియస్ అయ్యింది.

''అసలు ఈ అమ్మాయి ఉంటే నేను షోకి రాకూడదని అనుకున్నాను. మాట్లాడితే నా పర్సనాలిటీ మీద... నువ్వు సన్నగా ఉంటావు. అది నీ బాడీ తత్వం. నన్ను అనకు'' అని వర్ష ముఖం మీద రోహిణి ఫైర్ అయ్యింది. దాంతో షో నుండి వర్ష వాకౌట్ చేసింది. 'రోహిణి ఉంటే నేను షోకు రానండి' అని వర్ష వెళ్ళిపోయింది. 'నీ ముందు నిలబడాలంటే నాకు చిరాకు' అని రోహిణి అన్నది. వీళ్లిద్దరి ప్రవర్తన చూసి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సుమ సైతం అసహనం వ్యక్తం చేసింది.

వర్ష, రోహిణి గొడవ ప్రాంక్ లో భాగమా? లేదంటే నిజమా? అనేది షో టెలికాస్ట్ అయితే గానీ తెలియదు. టీఆర్పీ కోసం ఈమధ్య ఇటువంటివి చేస్తున్నారు. 'జబర్దస్త్'లో వెంకీ మంకీస్ టీమ్ లీడర్ వెంకీ అందరితో తాను స్కిట్స్ చేయిస్తుంటే తనకు పేరు రావడం లేదని వాపోయాడు. దాన్ని ప్రోమోలో హైలైట్ చేశారు. షో చూస్తే... ప్రాంక్ అన్నారు. వర్ష, రోహిణి గొడవ నిజమా? కాదా? అన్నది త్వరలో తెలుస్తుంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.