English | Telugu

పుష్ప 3 స్టోరీ ఇలా ఉండబోతుందా ?


జబర్దస్త్ సరిపోదా శనివారం ఎపిసోడ్ లో బులెట్ భాస్కర్ స్కిట్ అదిరిపోయింది. పుష్ప 1 , 2 సిరీస్ చూసాం కానీ ఇక్కడ పుష్ప 3 ఎలా ఉండబోతోందో చూపించారు. పుష్ప కార్ యాక్సిడెంట్ లో చనిపోవడం శ్రీవల్లికి ఒక బాబు పుట్టాడు. వాడు పుట్టినదగ్గర నుంచి స్కూల్ కి వెళ్లకుండా సిండికేట్ డీలింగ్స్ చేస్తూ ఉంటాడు. ఇక జూనియర్ పుష్పగా నాటీ నరేష్ అతని తల్లిగా ఫైమా చేసింది. జూనియర్ పుష్పని పిచ్చకొట్టుడు కొడుతోంది. ఇక ఇందులో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా సత్యశ్రీ చేస్తుంది. ఇక ఆమె పుష్ప డీటైల్స్ తీసుకోవడానికి వస్తుంది.

వివరాలన్నీ అడుగుతూ ఉంటుంది. "మీకు ఆస్తులు ఉన్నాయా" అని అడుగుతుంది సత్యశ్రీ. దానికి బులెట్ భాస్కర్ రెచ్చిపోయి "బోడుప్పల్ లో రెండు కోట్ల విలువైన బిల్డింగ్ ఉంది..అది కూడా బఫర్ జోన్ లో ఉంది.. రేపో మాపో వాళ్లొచ్చి కూల్చేస్తారు" అన్నాడు. వెంటనే నాటీ నరేష్ భయపడిపోయి " ఒరేయ్ నువ్వు లేనిపోనివి చెప్పకురా...వాళ్ళు నిజంగానే అనుకుని వచ్చినా వస్తార్రా..." అన్నాడు. దీంతో నాటీ నరేష్ నిజంగానే బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకున్నాడా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను కూల్చేసిన విషయం తెలిసిందే. ఇక ఫైమా ఐతే స్కూల్ లో వెళ్లమంటూ తన్నడం తిట్టడం ఈ స్కిట్ లో హైలైట్ అయ్యింది. నిజంగా ఈ మూవీ డైరెక్టర్ ఇది చూస్తే పుష్ప 3 ని చూసి నవ్వుకోకుండా ఉండడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.