English | Telugu

రష్మీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది...లక్కీ భాస్కర్ కావడానికి ఫైమాకి ప్లాస్టిక్ సర్జరీ


ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోస్ లో యాంకర్ రష్మీ మీద జోక్స్ , కౌంటర్లు వేయడం బాగా ఎక్కువగా కనిపిస్తోంది. నెక్స్ట్ వీక్ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. అందులో చూస్తే రెండు స్కిట్స్ లో రష్మీ పేరును బాగా వాడేశారు. బులెట్ భాస్కర్ స్కిట్ లో ఐతే నాటీ నరేష్ వచ్చి పేరు చెప్పి డీటెయిల్స్ నోట్ చేసుకున్నాడు. లక్ష రూపాయలు కడిగితే కోటి రూపాయలు వస్తుంది అని చెప్పేసరికి ఫైమా డీటెయిల్స్ ఇచ్చాడు బులెట్ భాస్కర్.

ఎలాగైనా ఆ కోటి రూపాయలు కొట్టేసి లక్కీ భాస్కర్ ఐపోవాలని ప్లాన్ చేసి ఫైమాకి ప్లాస్టిక్ సర్జరీ చేయించాడు. ఆ ప్లాస్టిక్ సర్జరీలో ఏకంగా ఫైమా బదులు సత్య వచ్చేస్తుంది. "ఇదేంటి సర్ నా భార్య ఎక్కడ...ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తే ఇంత మార్పు వస్తుందా" అని అడిగాడు. "ఈమెనే నీ భార్య..ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇంత మార్పు వస్తుంది" అని డాక్టర్ చెప్పేసరికి "రష్మీ ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీలు ఎన్ని చేయించుకుందో ఏమిటో" అని భాస్కర్ కౌంటర్ వేసాడు. దానికి రష్మీ షాకైపోతుంది. "సి థిస్ గర్ల్...నంబర్ వన్ మేకప్ గర్ల్ " అంటూ వెనక ఒక డైలాగ్ కూడా వచ్చేసింది. ఇక ప్రోమో స్టార్టింగ్ లో దొరబాబు స్కిట్ లో కూడా రష్మీ పేరొచ్చింది. దొరబాబు పెళ్ళికొడుకు గెటప్ లో ఉంటాడు. ఆటో రాంప్రసాద్ దొరబాబును అడుగుతాడు " పెళ్లి కూతురు ఎలా ఉంటుంది" అని " అటు ఇటుగా రష్మిలా ఉంటుంది" అంటాడు దొరబాబు. "అటైతే ఓకే కానీ ఇటు రష్మిలా ఉంటే ఎందుకు బొక్కా" అంటూ కౌంటర్ వేసాడు ఆటో రాంప్రసాద్.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.