Read more!

English | Telugu

కృష్ణభగవాన్ మీద ప్రవీణ్ పంచ్..నువ్వు ఆ రాయి ఇచ్చాకే కిడ్నీలో రాళ్లు వచ్చాయంటూ కౌంటర్

ఎక్స్ట్రా జబర్దస్త్ లో పటాస్ ప్రవీణ్ మంచి కామెడీ స్కిట్ వేసాడు. కృష్ణ భగవాన్ మీద కామెడీ చేద్దాం అనుకున్నాడు కానీ అది రివర్స్ లో ప్రవీణ్ కే తెగిలింది. రంగురాళ్లు అమ్ముకునే అబ్బాయి క్యారెక్టర్ చేసాడు. "ఈ బీచ్ పేరేమిటో తెలుసా..మెరీనా బీచ్ కానీ అప్పుడప్పుడు రష్మీ వచ్చేసరికి రష్మీ బీచ్ ఐపోయింది" అని ప్రవీణ్ చెప్పేసరికి రష్మీ షాకైపోయింది. "ఈ బీచ్ లో నాకు రంగు రాళ్ళ బిజినెస్ ఒకటి ఉంది.. ఈ రాళ్లు పెట్టుకున్నవాళ్లంతా ఎక్కడో ఉన్నారు తెల్సా రష్మిగారు" అనేసరికి "అవునా" అంది రష్మీ. "అంతెందుకండి ఈ అమ్మాయి వెనక ఒక అబ్బాయి అలా గాలికి తిరిగేవాడు..అలా గాలికి తిరుగుతున్నాడని ఒక రింగ్ పెట్టా...గాలోడై ఇప్పుడు హిట్ కొట్టి రష్మీ కూడా దొరక్కుండా తిరుగుతున్నాడు" అంటూ ప్రవీణ్ సుడిగాలి సుధీర్ మీద ఒక పంచ్ వేసాడు.

"ఒకసారి కృష్ణ భగవాన్ గారు అలా వచ్చి బీచ్ దగ్గర ఆలోచిస్తూ ఉన్నారు" ఏమైంది సర్  అని నేను అడిగితే పంచులు సరిగ్గా వేయలేకపోతున్నాను" అన్నారు .."దానికి నేను వెంటనే ఒక పచ్చ రాయి తీసి పెట్టా" అన్నాడు ప్రవీణ్. " ఆ రాయిని పెట్టుకున్నాకే కిడ్నీలో రాళ్ళోచ్చాయి" అని రివర్స్ లో కృష్ణ భగవాన్ కౌంటర్ వేసేసరికి పటాస్ ప్రవీణ్ నాలుక్కరుచుకున్నాడు. ఇక జడ్జ్ ఖుష్బూ గురించి చెప్పబోతూ ఉండగా "నాకు తెలుసు నువ్వు నా దగ్గరకే వస్తావ్ అని..ఇదిగో నా చేతులకు ఉన్నాయి రంగురాళ్లు" అని చూపించేసరికి ప్రవీణ్ వేయాల్సిన కౌంటర్లు కి  ఫుల్ స్టాప్ పెట్టేసాడు. ఫైనల్ గా అన్ని అమ్మేశాక మిగిలిన ఒక్క రింగును చూపిస్తూ "రష్మీ గారు ఒక్క రింగు తీసుకోండి మీ షష్ఠిపూర్తికి ఐనా పనికొస్తుంది" అనేసరికి రష్మీ సీరియస్ లుక్ ఒకటి ఇచ్చేసింది. దాంతో ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.