English | Telugu

జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి ఇంట్లో విషాదం!

జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి గురించి అందరికీ తెలుసు..టిక్ టాక్ స్టార్ గా అందరికీ పరిచయమే. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈమె ఇంట్లో విషాదం నెలకొంది.

గుండెపోటుతో ఆమె తండ్రి తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న ఆడియన్స్, జబర్దస్త్ కమెడియన్స్ అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మృతిపై రీతూ చౌదరి భావోద్వేగానికి గురయ్యింది. తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. తండ్రితో కలిసున్న ఫొటోని ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టి.. “నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఈ ఫొటో తీసుకునే సమయంలో ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నీతో తీసుకున్న లాస్ట్ ఫొటో ఇదే నాన్న. నన్ను ఎలా వదిలి వెళ్ళిపోయావు నాన్నా? నువ్వు లేకుండా నేను ఉండలేను. డాడీ ప్లీజ్ తిరిగిరా నీ కూతురు దగ్గరికి” అంటూ రీతూ చౌదరీ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రీతూ చౌదరికి తన నాన్న అంటే చాలా ఇష్టం అని తమ మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉందని ఎన్నో సందర్భాల్లో చెప్పింది. ఇంట్లో అందరి కంటే నాన్న అంటేనే చాలా ఇష్టం. ఏ విషయమైనా సరే ఆయనతోనే పంచుకుంటుంది. అలాంటిది రీతూ ఇప్పుడు తన తండ్రి లేరనే విషయాన్ని తట్టుకోలేకపోతోంది. జబర్దస్త్ కమెడియన్స్, రీతూ ఫాన్స్ , నెటిజన్స్ అంతా కూడా ఆమె తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.