English | Telugu

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో జబర్దస్త్ టీమ్..ఇంతకు ఎం చేసారంటే?

జబర్దస్త్ టీమ్ 25 రోజులలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చినట్లు రీసెంట్ గా ఒక వీడియోని పోస్ట్ చేసాడు జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి. ఇంతకు ఏమయ్యింది అంటే...ఏలూరులో బిజెపి లీడర్ గారపాటి సీతారామాంజనేయ తరుపున కమలరధం పేరుతో జబర్దస్త్ కళాకారులు, మూవీ సింగర్స్ తో ఏర్పాటైన ఒక బృందం 25 రోజుల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఐతే ఈ ప్రచారం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఏలూరులోని సుంకరి వారి తోటలో ఈ టీమ్ నిర్వహించిన 102వ ప్రదర్శన తిలకించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేశారు.

ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కమల రధం ప్రచారాన్ని ముందుండి నడిపించిన వారిలో పాటల రచయిత అనంత శ్రీరామ్, జబర్దస్త్ కళాకారులు అదిరే అభి, ఇమ్మానుయేల్, జబర్దస్త్ అప్పారావు, వినోద్, బాబి, సినీ గాయని, గాయకులు లాస్య ప్రియ, అరుణ్ కౌండిన్య వున్నారు. ఈ బృందానికి అవార్డును, మెడల్స్ ను అందించారు. పొలిటికల్ పార్టీ తరపున ప్రచార రథం ద్వారా సినీ, టీవీ కళాకారులు 25 రోజుల్లో 100 ప్రదర్శనలు ఇవ్వడం దేశంలో ఇదే మొదటి సారి అన్నారు. బిజెపి తరఫున 26 రోజులు పర్యటించి 104 ప్రదర్శనలు పూర్తి చేసినట్లు చెప్పాడు జబర్దస్త్ కళాకారుడు అదిరే అభి అన్నారు. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ ఐనందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంత శ్రీరామ్.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.