English | Telugu

ఇంద్రజను ఏడిపించిన రోజా... జబర్దస్త్ నుంచి ఔట్!

ప్రతీ వారం లానే ఈ వారం జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోలో ఎప్పటిలాగే రాకెట్ రాఘవ కామెడీ స్కిట్ హిలేరియస్ గా అలరించింది. ఈ వారం ఏమయ్యిందో కానీ అన్ని స్కిట్స్ లో కామెడీ వరదైపొంగేలా కనిపిస్తోంది. ఐతే ప్రోమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా నవ్వు తెప్పించింది కానీ ప్రోమో లాస్ట్ లో మాత్రం ఆడియన్స్ ని ఏడిపించేసింది.. ఇంతకు విషయం ఏమిటి అంటే ఇంద్రజ చెప్పిన షాకింగ్ న్యూస్ ...దాంతో కమెడియన్స్ ఫేసులు వాడిపోయాయి. ఇంద్రజ మాట్లాడుతుండగానే ఏడ్చేసింది. "జబర్దస్త్ లో ఒక చిన్న గ్యాప్ ఐతే తీసుకుంటున్నాను." అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే ఆమె కొడుకులా చూసుకునే నూకరాజు మాట్లాడాడు "ఫస్ట్ టైం ఇండస్ట్రీ చరిత్రలో మన పేర్లు మారింది కేవలం జబర్దస్త్ వల్లే..." అన్నాడు. ఇక ఫైనల్ గా ఇంద్రజ వెళ్తూ వెళ్తూ తన జబర్దస్త్ ఫామిలీ మొత్తంతో ఫోటో దిగింది. ఇలా నెక్స్ట్ వీక్ నుంచి ఇంద్రజ షోలో కనిపించే ఛాన్స్ లేదని క్లియర్ గా తెలుస్తోంది. ఐతే ఇంద్రజ 2021 మే నుంచి ఆమె జబర్దస్త్ జడ్జ్ గా రోజా ప్లేస్ లో వచ్చిన విషయం తెలిసిందే.

అప్పటినుంచి ఇప్పటి వరకు ఆమెకు జబర్దస్త్ టీమ్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ తో మంచి బాండింగ్ ఐతే ఏర్పడింది. ఇక నూకరాజు ఆమె మీద చిన్న కవిత లాంటిది కూడా తన బుర్ర కథ స్కిట్ లో చెప్పుకొచ్చాడు. ఇక ఇంద్రజ కనిపించదు అని ప్రోమోలో చెప్పేసరికి నెటిజన్స్ కూడా బాధపడుతున్నారు. అలాగే ఇక ఈ షోకి మళ్ళీ జడ్జ్ గా రోజా గాని వచ్చేస్తుందా ఏమిటి ? అంటూ అడుగుతున్నారు. మరి ఇంద్రజ ప్లేస్ ఎవరు వస్తారు అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సు గా ఉంది. నెక్స్ట్ వీక్ ఎప్పుడొస్తుందా ... జడ్జ్ ఎవరు వస్తారా ? అని ఆడియన్స్ కూడా తెగ ఎదురుచూస్తున్నారు. చూడాలి ఎవరొస్తారో.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.