English | Telugu

ఐ ల‌వ్ యు ఇంద్ర‌జా!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక రాబోయే వారం "మళ్ళీ పెళ్లి" అనే కాన్సెప్ట్ తో ఈ షో ఫన్ క్రియేట్ చేయబోతోంది. ఈ షోకి సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ మధ్య కాలంలో చూస్తే గనక ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. షోస్ కి జడ్జెస్ గా వచ్చేవాళ్ళు తమ బెటర్ హాఫ్స్ కి స్టేజి మీద నుంచి, షోస్ నుంచి ఫోన్ చేయడం. క్యూట్ గా మాట్లాడుకోవడం. దాన్ని ప్రోమోలా కట్ చేసి సోషల్ మీడియాలో వదిలి వ్యూస్ సంపాదిస్తున్నారు.

ఇంతకుముందు జబర్దస్త్ లో ఖుష్భు తన భర్త సుంద‌ర్‌కు ఫోన్ చేసింది. ఇక ఇప్పుడు ఇంద్రజ వంతు వచ్చింది. రాబోయే వారం ఎపిసోడ్ లో "మళ్ళీ పెళ్లి" అంటూ ఆల్రెడీ పెళ్లి చేసుకున్న కొంతమంది జంటలను తీసుకొచ్చి వాళ్లకు మళ్ళీ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టేజి మీద పెళ్లి చేశారు.

ఇక ఇంద్రజను రష్మీ, రాంప్రసాద్ స్టేజి మీదకు తీసుకొచ్చి వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేయించారు. "సర్ బాగున్నారా.. ఈరోజు ఈ షోలో మళ్ళీ పెళ్లి చేయబోతున్నాం. ఇంద్రజ మేడం మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు.." అని ర‌ష్మీ అన్నాక‌, రాంప్రసాద్ ఫోన్ తీసుకుని "మేడంకి ఒకసారి ఐ లవ్ యు చెప్తారా వినాలని ఉంది" అన్నాడు.

దాంతో ఆయన"ఒక్కసారేనా చెప్పేది" అంటూ "ఐ లవ్ యు ఇంద్రజ" అని ఎంతో క్యూట్ గా చెప్పేసారు. దానికి ఇంద్రజ సిగ్గుపడిపోయింది "ఐ లవ్ యు సో సో సో మచ్" అని రిప్లై ఇచ్చారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.