English | Telugu

Illu illalu pillalu : నిజాన్ని బయటపెట్టిన రామరాజు.. వేదవతితో సహా అందరు షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -60 లో.... రామరాజు ఎక్కడ అంటూ వేదవతి ఇంట్లో అంతా వెతుకుతుంటుంది. ఎక్కడా కన్పించకపోవడంతో వేదవతి టెన్షన్ పడుతూ అందరికి చెప్తుంది. ఆ తర్వాత నాన్న ఎక్కడున్నాడో నేను చూసి వస్తానంటూ చందు వెళ్తాడు. చందు అంతా వెతికి చివరికి మిల్ కి వెళ్తాడు. అక్కడ నేలపైన రామరాజు పడుకొని ఉండటం చందు చూస్తాడు.

అలా రామరాజుని ఆ సిచువేషన్ లో చూసి చందు ఎమోషనల్ అవుతాడు. చందు వెళ్లి రామరాజుని లేపి మీరు ఇక్కడున్నారేంటని అడుగగా.. మరేం చెయ్యాలి నా స్థాయి ఇదేనంటూ రామరాజు బాధపడతాడు. ముగ్గురు కొడుకులు నా మాట వింటారని చాలా మురిసిపోయాను కానీ నడిపోడు, చిన్నడు నా పరువు తీశారంటూ రామరాజు బాధపడుతాడు. కాసేపటికి నాన్న ఇంటి దగ్గర అమ్మ ఏడుస్తుందని చందు చెప్పగానే.. అవునా పదా వెళదామంటూ రామరాజు అంటాడు. ఇక ఇద్దరు ఇంటికి వస్తారు. రామరాజుని చూసి ఇంట్లో అందరు హ్యాపీగా ఫీలవుతారు. అలా ఎందుకు వెళ్లారండని వేదవతి అడుగగా.. నీ వల్లే వెళ్ళాను.. నీ వల్లే వాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నువ్విచ్చిన ధైర్యం వల్లే పెళ్లి చేసుకున్నాడని రామారాజు అనగానే.. వేదవతి, నర్మద, ధీరజ్, ప్రేమ వాళ్లు నిజం తెలిసిపోయిందని కంగారుపడతారు.

ఆ తర్వాత రామరాజు లోపలికి వెళ్తాడు. పదండి అత్తయ్య లోపలికి వెళదామని నర్మద అనగానే.. నేను రాను అంటూ వేదవతి భయపడుతుంది. లోపలికి వెళ్ళకు.. అంత నీవల్లే కదా ఎప్పుడు వెనకేసుకొని వచ్చావ్.. ఇంట్లో వద్దంటే మళ్ళీ గొడవ చేసి ఇంట్లోకి రప్పించావ్.. నేను తిట్టిన ప్రతిసారీ మా అమ్మ నా వెనకాల ఉందని అనుకునేవాడు.. బాగా గారాబం చేసావని రామరాజు అంటాడు‌. హమ్మయ్య నిజం తెలియదని వేదవతి వాళ్లు రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత ధీరజ్ మాట్లాడుతుంటే.. నువ్వు నాతో మాట్లాడకని రామరాజు అంటాడు. నేను మాట్లాడతానని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.