English | Telugu

Illu illalu pillalu : ప్రేమ పెళ్ళి చేసుకున్నాడని ఇంట్లో నుండి గెంటేసిన తండ్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -28 లో.....ధీరజ్ దగ్గరుండి మరీ సాగర్, నర్మదల పెళ్లి జరిపిస్తాడు. ఇక నర్మద మీ ఇంటికి వెళదామనడంతో ధీరజ్ సపోర్ట్ తో ఇంటికి బయలుదేర్తారు. మరొకవైపు రామరాజు పెద్ద కూతురు కామాక్షి వేదవతి దగ్గరికి వస్తుంది. తన కూతురు అక్కడే ఉండి చదువుతుంటుంది. ఇక్కడ తాతయ్య భయంతో చదువుతావని ఇక్కడ ఉంచితే చదవడం లేదని తన కూతురిని కామాక్షి తిడుతుంది.

ఇక కామాక్షి తన చెల్లితో గొడవపడుతుంది. అప్పుడే సాగర్ నర్మదలని తీసుకొని ధీరజ్ ఇంటికి వస్తాడు. వాళ్ళని చూసి అందరు షాక్ అవుతారు. అల్లుడు ఎంత పని చేసావ్ రా అని వాళ్ళ మామ అంటాడు. అప్పుడే రామరాజు బయటకు వచ్చి ఏమైందని అంటాడు. నర్మద, సాగర్ లని చూసి షాక్ అవుతాడు. ఎదురింట్ల ఉన్న సేనాపతి, భద్రవతి ఇద్దరు వాళ్ళని చూసి రామరాజు పరువు పోయిందని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. తండ్రి దారినే కొడుకు అంటు రామరాజుకి ఇంకా కోపం వచ్చేలా సేనాపతి మాట్లాడతాడు.

నాన్న నన్ను క్షమించండి అని సాగర్ అనగా... నువ్విలా చేస్తావనుకులేదని రామరాజు బాధపడతాడు. నువ్వు ఇలా ఎలా చేసావ్ రా అందుకేనా వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళావని వేదవతి అంటుంది. మీ నాన్న పరువు తీసావ్ కదరా అని వేదవతి బాధపడుతుంది. తరువాయి భాగంలో ఊళ్ళో వాళ్లు రామరాజు కొడుకు లేచిపోయి.. పెళ్లి చేసుకున్నాడంటూ తప్పుగా మాట్లాడుతుంటే ధీరజ్ వాళ్లపై కోప్పడతాడు. ఆ తర్వాత సాగర్ ని ఇంట్లో నుండి రామరాజు గెంటేస్తాడు. ఆ తర్వాత జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.