English | Telugu

Illu illalu pillalu : ధీరజ్ పై కోప్పడిన రామరాజు.. జీతం డబ్బుల కోసం రచ్చ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-155 లో... చందు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అబ్బా వచ్చారా.. ఉదయం నుండి బోర్ కొడుతుందని శ్రీవల్లి అనగానే.. ఎందుకు ఇంట్లో అందరు ఉన్నారుగా అని చందు అంటాడు. ఉంటే మీరు లేరు కదా అని శ్రీవల్లి అంటుంది. చందు తన జీతం డబ్బు శ్రీవల్లికి ఇచ్చి.. ఇది రేపు నాన్నకి ఇవ్వాలని అంటాడు. అంత డబ్బు శ్రీవల్లి చూసి షాక్ అవుతుంది. ఇంత డబ్బు మా ఆయన ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఎలా అందరు మా అయన సంపాదనతో బ్రతుకుతున్నారన్నమాట అని శ్రీవల్లి అనుకుంటుంది.

మరోవైపు నర్మద అన్న మాటలకి సాగర్ బాధపడతాడు. సాగర్ దగ్గరికి ధీరజ్ వచ్చి ఏంట్రా ఇలా ఉన్నావని అడుగుతాడు. జరిగింది చెప్పి సాగర్ బాధపడతాడు. నాన్న మిల్ లో వర్క్ ఉందని అలా చేసాడు అంతే కానీ నీ భార్యతో బయటకు వెళ్లొద్దని కాదని ధీరజ్ చెప్తాడు.

మరుసటిరోజు రామరాజుకి వేదవతి టీ ఇస్తుంది. ముగ్గురు కోడళ్ళు చాలా బాగా కలిసిపోయారంటూ మురిసిపోతు రామరాజుకి చెప్తుంది. ధీరజ్ తన నెల శాలరీ రామరాజుకి ఇవ్వాలనుకుంటాడు. మరొకవైపు చందు తన శాలరీ రామరాజుకి ఇవ్వడానికి వస్తాడు. నాకు హైదరాబాద్ లో ట్రైనింగ్ ఉందని మీ నాన్న గారికి చెప్పమని సాగర్ తో నర్మద అంటుంది. సాగర్ రామరాజుకి చెప్పడానికి వస్తాడు. అప్పుడే చందు శాలరీ ఇస్తాడు.

ఆ తర్వాత ధీరజ్ డబ్బు ఇస్తుంటే నువ్వు ఎందుకు ఇస్తున్నావని వేదవతి అంటుంది. అంటే నాకూ నా భార్య కి ఇంట్లో ఉండడానికి చోటు ఇంకా భోజనం పెడుతున్నారు కదా అని ధీరజ్ అంటాడు‌. దాంతో రామరాజుకి కోపం వస్తుంది.

ఇద్దరు మనుషుల తిండికి ఒక ఆరు వేలు సరిపోతాయా అని వేదవతిని రామరాజు అడుగుతాడు. వేదవతి చెప్పకపోవడంతో శ్రీవల్లిని రామరాజు అడుగుతాడు. ఎనిమిది నుండి పది వేలు అవుతాయని చెప్తుంది. మరి నువ్వు ఏ లెక్కన ఇస్తున్నావ్.. ఉద్యోగం చేస్తున్నానని పొగరు కదా అని ధీరజ్ పై కోప్పడతాడు రామరాజు.

తరువాయి భాగంలో ఇంట్లో అందరికంటే నా భర్త ఎక్కువ సంపాదిస్తున్నాడని శ్రీవల్లి అంటుంది. మా ఆయనకు జీతం ఇస్తే మీ ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.