English | Telugu

ఇక నవ్వడం నేనెప్పటికీ ఆపను...

"అనుమానస్పదం" మూవీ తో వెండితెరకు పరిచయమైన మెరుపు హంసానందిని. ఆ తర్వాత ఎన్ని మూవీస్ లో నటించినా తనకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈగ మూవీలో కనిపించింది కాసేపే ఐనా కూడా కొంత పేరైతే వచ్చింది. కానీ ఆమె కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ క్యాన్సర్ బారిన పడింది. మనీషా కోయిరాలా, సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్ వంటి ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ క్యాన్సర్ బారిన పడి నెమ్మదిగా కోలుకుని.. తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీళ్ళలో హంసానందిని కూడా ఒకరు. అలాంటి హంసానందిని ఆధ్యాత్మికత దిశగా అడుగులు వేస్తోంది. కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటోంది. తన కొత్త లుక్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అలాంటి హంసానందిని రీసెంట్ గా ఇషా ఫౌండేషన్‌ కి వెళ్ళింది. దానికి సంబంధించిన ఎన్నో ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది. "ఆత్మసాక్షాత్కారం పొందడం అంటే మనలో ఉన్న మూర్కత్వాన్ని వదిలిపెట్టడమే. ప్రతిదీ మనలోనే ఉంది కానీ మనమే దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ నేను ఒక విషయం నేను చెప్పాలి అంటే నేను ఆశ్రమంలోకి అడుగుపెట్టిన క్షణంలో ఒక అనిర్వచనీయమైన శక్తిని అనుభవించాను. ఇప్పుడే ఈ క్షణాన్ని ఆస్వాదించాలి, బతకాలి అనే అందమైన అనుభూతి నాలో కలిగింది. ఇక నేను నవ్వడం ఎప్పటికీ ఆపను. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌కి ధన్యవాదాలు..ఇక్కడి నన్ను ఆహ్వానించి, నాలో ఈ ఫీలింగ్ ని కలిగేలా చేసినందుకు" అని చెప్పారు హంసానందిని. రీసెంట్ గా ఆమె ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. రెండేళ్ల క్రితం తనకు బ్రెస్ట్ క్యాన్సర్ , ఒవేరియన్ కాన్సర్ ఉందని దానికి కీమోలు కూడా తీసుకున్నానని చెప్పారు.. అలాగే కీమోలు తీసుకునేటప్పుడు జుట్టు ఓడిపోవడంతో గుండుతో ఉన్న ఫోటోని కూడా పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు హంసానందిని ట్రీట్మెంట్ తీసుకుని మరింత ఎనెర్జీతో, మరింత అందంతో మళ్ళీ అందరి ముందుకు రావడంతో నెటిజన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ పాజిటివ్ కామెంట్స్ ని పోస్ట్ చేస్తున్నారు.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.