English | Telugu

Guppedantha Manasu:ఆ మూడవ మనిషి భద్రేనని డౌట్.‌. నువ్వు ఎండీ అయ్యాకే ఇవన్నీ గొడవలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -987 లో.. శైలేంద్ర తెలివిగా తప్పించుకున్న సంఘటన గుర్తుకు చేసుకొని వసుధార ఆవేశంతో తన గదిలోని సామాన్లని కిందపడేస్తుంటే.. మహేంద్ర, అనుపమ ఇద్దరు కంగారుపడుతు వసుధార దగ్గరికి వస్తారు. అంత కోపంగా ఉన్న వసుధారని చూసి ఇద్దరు షాక్ అవుతారు. నాకు రిషి సర్ కావాలి మావయ్య అంటూ బాధగా మహేంద్ర దగ్గరికి వెళ్లి వసుధార అడుగుతుంది.

ఆ తర్వాత అసలు రిషిని ఆ శైలేంద్ర కిడ్నాప్ చెయ్యలేదని ముకుల్ అన్నట్లు నాక్కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అతను ప్రోగ్రామ్ జరిగే దగ్గర మనతోనే ఉన్నాడని అనుపమ అంటుంది. దేవయాని వదిన అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు తను ఇంటిదగ్గరే ఉందని మహేంద్ర అంటాడు. ఇందులో మూడవ వ్యక్తి ఉన్నారు. ఎవరు అతను నా ఫోన్ లో వీడియో కూడా డిలీట్ చేసాడంటూ వసుధార ఆలోచనలో పడి ఒక్కసారిగా భద్ర అని అనగానే.. మహేంద్ర, అనుపమ లు షాక్ అవుతారు. వాళ్ళ మాటలన్ని భద్ర చాటుగా వింటు ఉంటాడు. ఆ తర్వాత భద్ర ఇదంతా చేసే అవకాశం ఉంది నా దగ్గరకి మొన్న అడ్రస్ తెలియకున్నా కనుక్కొని వచ్చాడు. ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరంటే అర్థం లేకుండా సమాధానం చేప్తున్నాడని వసుధార అంటుంది. అదంతా విన్న భద్ర.. శైలెంద్రకి ఫోన్ చేసి తనపై డౌట్ వచ్చిన విషయం చెప్తాడు ఇక లేట్ చెయ్యకుండా ఆ వసుధారని లేపేయ్ అని చెప్తాడు. దానికి భద్ర ఓకే అంటాడు.

ఆ తర్వాత వసుధార ఒంటరిగా కూర్చొని.. ఇందాక తము మాట్లాడుకుంటున్నప్పుడు భద్ర కిటికీలో నుండి విన్నది వసుధార చూస్తుంది. ఆ విషయం గుర్తుకుచేసుకుంటుంది వసుధార. ఆ తర్వాత కాలేజీలో స్టూడెంట్స్ ని శైలెంద్ర రెచ్చగొడతాడు. రిషి సర్ కావాలని గొడవ చేస్తుంటారు స్టూడెంట్స్. అక్కడకి వసుధార, మహేంద్ర, అనుపమ, ఫణీంద్రలు వచ్చి సర్ది చెప్తారు. అయిన వాళ్ళు వినరు. ఆ తర్వాత మినిస్టర్ గారు వచ్చి.. ఏంటి ఈ గొడవలు రిషి సర్ వస్తారని అన్నావ్. తీసుకొని రాలేదు నువ్వు ఎండీగా ఉన్నప్పటి నుండే ఇవన్ని జరుగుతున్నాయంటు మినిస్టర్ గారు వసుధారపై కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.