English | Telugu

Guppedantha Manasu Serial Saroja (Vinitha) : గుప్పెడంత మనసు రిషి మరదలు సరోజ షాకింగ్ కామెంట్స్!

గుప్పెడంత మనసు సీరియల్ కి తెలుగు టీవీ కార్యక్రమాల్లోనే అత్తధిక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పటికే క్లైమాక్స్ ఎపిసోడ్ పూర్తయిందని దర్శకుడు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలని కూడా షేర్ చేశాడు. ఇక తాజాగా జ్యోతిరాయ్, రిషి వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. వీరితో పాటుగా కొత్త క్యారెక్టర్ సరోజ కూడా బాగా పాపులర్ అయింది.

రిషికి మరదలుగా సరోజ పాత్రలో రాణిస్తుంది వినీత. ఈమె మన తెలుగు అమ్మాయే. పక్కా హైదరాబాదీ. ఇక్కటే పుట్టి పెరిగింది. బీటెక్ వరకు చదివిన వినీత.. 2020 కోవిడ్ బ్యాచ్‌లో బీటెక్ పూర్తి చేసింది. సీరియల్స్‌లోకి రాకముందు తమడా మీడియాలో పనిచేసింది. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్‌లో కూడా నటించింది. సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నించిన వినీత.. వెండితెరపై అవకాశం రాలేదు కానీ.. బుల్లితెరపై రాణిస్తోంది. అనేక సీరియల్స్‌లో నటించింది వినీత.

మొదట్లో ఈవీటీలో అను-పల్లవి సీరియల్‌లో నటించిన వినీత.. జీ తెలుగులో ‘దేవతలారా దీవించండి’, ‘ఊహలు గుసగుసలాడే’ సీరియల్స్‌లో నటించింది. వీటితో పాటు.. పలు టీవీ షోస్‌లోనూ కనిపించింది. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ పంచ్‌లు పేల్చింది వినీత. దేవతలారా దీవించండి సీరియల్‌లో నెగిటివ్ రోల్‌ పోషించి.. నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత ఊహలు గుసగుసలాడే సీరియల్‌లోనూ మెప్పించింది వినీత. కాగా ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. రాకేష్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్‌లో రంగా (రిషి) మరదలిగా చేస్తోంది. చూడ్డానికి కుందనపు బొమ్మలా, తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తోంది. అందానికి తగ్గ అభినయం అన్నట్టుగానే రంగా మరదలిగా నటనతోనూ మెప్పిస్తోంది వినీత.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వినీత మాట్లాడుతూ.. తను చాలా తక్కువ రోజులే షూటింగ్ లో ఉన్నానని, ఇంత తొందరగా ముగుస్తుందని ఊహించలేదని అంది. రిషి, వసుధారలు షూటింగ్ కి వెళ్లిన మొదటిరోజే కలిసిపోయారని, వాళ్ళిద్దరు డౌన్ టూ ఎర్త్ అని చాలా బాగా మాట్లాడతారని, ఈజీగా ఫ్రెండ్స్ అయిపోయారంటు వినీత చెప్పుకొచ్చింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.