English | Telugu

Guppedantha Manasu : ఏదీ ఒకసారి తాతయ్య అని పిలువు.. నేను పిలవనని మనవడి పట్టింపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1044 లో.. విశ్వనాథ్ కి ఏంజిల్ జరిగింది మొత్తం చెప్తుంది. అనుపమ గురించి తెలిసి విశ్వనాథ్ షాక్ అవుతాడు. అసలు పెళ్లి అయినట్టు కూడా తెలియదని విశ్వనాథ్ అనగానే.. అత్తయ్య ఏమైనా నీ దగ్గర ఉందా? అన్ని తెలియడానికి.. అసలు అత్తయ్య ఉందన్న విషయమే ఆమె వచ్చాక తెలిసిందని ఏంజిల్ అంటుంది.

ఆ తర్వాత మను గురించి ఏంజిల్ ని విశ్వనాథ్ అడుగుతాడు. మను బాగుంటాడా అని అడుగగా.. చాలా బాగుంటాడు తెలుగు సినిమా హీరోలా ఉంటాడని ఏంజిల్ చెప్తుంది. మనవడు రాగానే ఈ మనవరాలని మర్చిపోతున్నావ్.. ఏంటి విషయం అని ఏంజిల్ అంటుంది. నువు పెళ్లి చేసుకొని వెళ్తే నన్ను చూసుకునేది తనేగా.. నువ్వు ఆస్తి విషయంలో గొడవపడితే నాకు సపోర్ట్ గా ఉండేది తనే అని విశ్వనాథ్ సరదాగా మాట్లాడతాడు. నాకు మనుని చూడాలనిపిస్తుందని అనగానే.. సరే తీసుకొని వస్తానని ఏంజిల్ చెప్తుంది. ఆ తర్వాత మనుకి ఏంజిల్ కాల్ చేసి.. కలిసి మాట్లాడాలి.. నేను చెప్పిన ప్లేస్ కి రండి అని అంటుంది. నేను రాను.. విషయం ఏంటో ఫోన్ లో చెప్పండని మను అంటాడు. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అందుకే పిలుస్తున్నానని ఏంజిల్ అనగానే.. నాకు ఇప్పుడు తినాలని లేదని ఫోన్ కట్ చేస్తాడు. ఇప్పుడు మనుని ఇక్కడికి ఎలా రప్పించాలని ఏంజిల్ అనుకుని వసుధారకి ఫోన్ చేస్తుంది. " తాతయ్యకు అంత చెప్పాను మనుని ఒకసారి చూడాలని అంటున్నాడు.. నువు ఎలాగైనా మనుని తీసుకొనిరా " అని చెప్పగానే వసుధార సరే అంటుంది.

ఆ తర్వాత మనుకి వసుధార ఎదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని చెప్పి.. విశ్వనాథ్ ఇంటికి మనుని తీసుకొని వస్తుంది. మనుని చూసి విశ్వనాథ్ హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు. నేను నీకు తాతయ్యని అని మనుతో విశ్వనాథ్ చెప్పి.. ఏదీ ఒకసారి తాతయ్య అని పిలువు అని అంటాడు. నేను పిలవను.. నాకు ఇప్పుడు బంధాలు అవసరం లేవని మను అంటాడు. అతను అంత ప్రేమగా చూస్తుంటే మీరెందుకు అలా చేస్తున్నారని వసుధార అంటుంది. మీ కన్నకూతురు అంటున్నారు.. నా కన్నతల్లి నన్ను కొడుకుగా అంగీకరించడం లేదు.. నేను మిమ్మల్ని ఎలా అంగీకరిస్తాను.. ఆవిడకి దూరంగా ఉంటున్నప్పుడు, నేను మీకెలా దగ్గరగా ఉంటానని మను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.