English | Telugu

Guppedantha Manasu : బుద్ధి ఉందా అసలు, ఎందుకిలా చేశావ్.. మను చెంపలు వాయించేసిన అనుపమ!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1027 లో.. మహేంద్ర అనుపమలకి వసుధార కాఫీ తీసుకొని వస్తుంది. అనుపమ ఏదో ఆలోచిస్తూ డల్ గా ఉంటుంది. అది చూసిన మహేంద్ర.. ఏమైందని అడుగుతాడు. ఏం లేదంటూ అనుపమ చెప్తుంది. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో అర్థం కావడం లేదని మహేంద్ర అనగానే.. నన్నే అంటున్నావ్ కదా అని అనుపమ అడుగుతుంది.

ఇక్కడ నుండి దూరంగా వెళదామని చెప్పాను కానీ మను మన జీవితాల్లోకి వచ్చినప్పటి నుండి ఒక ఫీలింగ్ వచ్చింది.. దైర్యంగా ఉందని మహేంద్ర అంటాడు.. అవును మావయ్య నాకు రిషి సర్ విషయంలో కూడా హెల్ప్ చేస్తానని అన్నారని వసుధార అంటుంది. ఆ తర్వాత జగతి ఫోటో దగ్గరికి మహేంద్ర వెళ్లి మాట్లాడతాడు. ఆ తర్వాత రిషి ఫోటో దగ్గరికి వెళ్లి తమ జ్ఞాపకాలు గుర్తుకుచేసుకుంటాడు. మరొకవైపు మనుతో ఎలాగైనా ఈ రోజు మాట్లాడాలి మళ్ళీ వాడు ఎందుకు వచ్చాడో కనుక్కోవాలని అనుపమ తన క్యాబిన్ కి వెళ్తుంది. వెళ్లేసరికి మను లేకపోవడంతో మళ్ళీ వద్దామంటూ అనుపమ తిరిగి వెళ్తుంటే.. శైలేంద్ర క్రియేట్ చేసిన మను, వసుధారల పోస్టర్లు చూసి షాక్ అవుతుంది. అప్పుడే వసుధార కూడా వచ్చి వాటిని చూస్తుంది.

ఆ తర్వాత మను రాగానే ఏంటి ఇది అని అనుపమ కోప్పడుతుంది. అనుపమ కోపంగా మను రెండు చెంపలపై కొడుతుంది. ఎందుకు ఇలా చేసావ్ బుద్ధి లేదా నీ మనసుకి ఏదనిపిస్తే అది చేస్తావా అంటూ పోస్టర్లు చింపేస్తుంది. మను చెప్పబోతుంటే అసలు అనుపమ వినిపించుకోదు. పాపం వసుధార తన గురించి తెలిసే ఇలా చేస్తున్నావా.. నువ్వు అసలు నాకు కన్పించకు.. ఇక్కడ నుండి వెళ్లిపో.. ఇక ఎప్పటికి ఇటువైపు రాకని మనుని అనుపమ తిడుతుంది. మీరు అలా మాట్లాడకండి వెళ్ళిపోతానంటూ మను అంటాడు. మీ గురించి చాలా గొప్పగా అనుకున్నానని వసుధార అంటుంది. అదంతా శైలేంద్ర విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.