English | Telugu

Guppedantha Manasu:జస్ట్ మిస్.. పులి మేక ఆటలో ఎవరు గెలిచినట్లు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -964 లో... వసుధారని కిడ్నాప్ చేశారని ముసలావిడ లోపలికి వచ్చి రిషికి చెప్పగానే కంగారుగా రిషి లెవబోతుంటాడు. అది చూసిన ముసలివాళ్ళు.. వద్దని చెప్పి వసుధార ఫోన్ రిషికి ఇచ్చి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైన చెయ్యండి అంటారు. రిషి ఆలోచిస్తూ డాడ్ కి చెప్తే టెన్షన్ పడుతాడని ముకుల్ కి కాల్ చేయాలని అనుకుంటాడు.

కాసేపటికి ముకుల్ కి కాల్ చేస్తాడు రిషి. వసుధార ఫోన్ నుండి కాల్ రావడం ఏంటని అనుకోని.. చెప్పండి మేడమ్ అంటాడు. ఆ తర్వాత రిషి మాటలు విని ఆశ్చర్యపోతాడు. మీరు ఎలా ఉన్నారు రిషి సర్.. అసలు వసుధార ఫోన్ మీ దగ్గరకి ఎలా వచ్చిందంటు అడుగుతాడు. రిషి జరిగిందంతా చెప్తాడు. వసుధార ప్రాబ్లెమ్ లో ఉంది మీరు వచ్చి త్వరగా కాపాడండని రిషి చెప్పగానే ముకుల్ వెంటనే బయలుదేర్తాడు. మరొకవైపు వసుధారని కిడ్నాప్ చేసిన రౌడీలు.. వసుధార నోటికి ప్లాస్టర్ వేస్తారు. అక్కడ రౌడీలంతా కలిసి పులి మేక ఆడుతుంటారు. అప్పుడే అక్కడికి ముకుల్ ఎంట్రీ వస్తాడు. ఇక ఒక్కో రౌడీని చితక్కొడతాడు ముకుల్. కాసేపటికి ముకుల్ ని చూసి వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వసుధారని ముకుల్ అక్కడ నుండి పంపించేస్తాడు. మీ బాస్ ఎవరు అంటు గన్ తో రౌడీ లని బెదిరిస్తాడు. కానీ రౌడీలెవరు చెప్పరు. అప్పుడే శైలేంద్ర ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్తాడు. సరే రండి అని రౌడీలు శైలేంద్రకి చెప్తారు. మరొకవైపు శైలేంద్రకి ధరణి ఫోన్ చేస్తుంటుంది. ఎన్నిసార్లు చేసిన శైలేంద్ర లిఫ్ట్ చెయ్యడు. అప్పుడే దేవయాని వచ్చి ఎందుకు అన్ని సార్లు చేస్తున్నావని కోప్పడుతుంది దాంతో ధరణి ఏడుస్తుంది. అప్పుడే ఫణింద్ర వచ్చి.. ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. మీ అబ్బాయి ఎక్కడికో హడావిడిగా వెళ్లారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడం లేదని అనగానే శైలేంద్రకి ఫణీంద్ర ఫోన్ చేస్తాడు. ధరణి అనుకుని ఫణింద్రతో కోపంగా మాట్లాడుతాడు శైలేంద్ర. ఆ తర్వాత ఫణీంద్ర వాయిస్ విని శైలేంద్ర షాక్ అవుతాడు. ఇక శైలేంద్రకి ఫణీంద్ర క్లాస్ పీకుతాడు.

మరొకవైపు రౌడీలని కంట్రోల్ చేస్తున్న ముకుల్ ని భద్ర చూసి.. శైలేంద్రకి ఫోన్ చేసి మీరు ఇప్పుడు ఇక్కడికి రాకండని చెప్తాడు. వసుధర ఇక్కడ లేదు. ఆ ముకుల్ ఉన్నాడని చెప్పగానే శైలేంద్ర రాకుండా వెన్నక్కి వెళ్లిపోతాడు. అలా ముకుల్ ని డైవర్ట్ చేసి రౌడీలని తప్పించుకునేలా భద్ర చేస్తాడు. కాసేపటికి రౌడీలు తప్పించుకున్నారని ముకుల్ డిస్సపాయింట్ అవుతాడు. మరొకవైపు రిషిని తీసుకొని వసుధార బయలుదేర్తుంది. అసలు ఏం జరిగిందని వసుధారకి రిషి చెప్తాడు. ఎవరో కిడ్నాప్ చేశారు తప్పించుకొని వెళ్తు ఫారెస్ట్ లో పడిపోయాను. వాళ్ళు కాపాడారని రిషి చెప్తాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.