English | Telugu

గృహలక్ష్మి సీరియల్ 1000 ఎపిసోడ్ సెలబ్రేషన్స్!

గృహలక్ష్మి సీరియల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతూ.. 1000 ఎపిసోడ్ మైలురాయిని చేరుకుంది. ప్రతి ఇంట్లో మహిళ ఎదుర్కునే ఇబ్బందులు, చేసే త్యాగాలను వివరిస్తూ మంచి కథతో సాగుతున్న ఈ సీరియల్.. ఇప్పుడు టీఆర్పీలో టాప్ రేటింగ్ లో ఉంది.

గృహలక్ష్మి సీరియల్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అనడంలో ఆశ్చర్యం లేదు. తులసి పాత్రలో కస్తూరి నటిస్తుంది. కస్తూరి శంకర్.. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర కథానాయకులతో కలిసి సినిమాలు చేసింది. అయితే సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో..2014లో టాప్‌లెస్ ఫోటోషూట్ ద్వారా కస్తూరి శంకర్ వార్తల్లో వ్యక్తిగా మారింది. "జేడ్ బెల్ పుస్తకం ది బాడీస్ ఆఫ్ మదర్స్: ఎ బ్యూటిఫుల్ బాడీ ప్రాజెక్ట్‌" లో భాగంగా ఆమె అర్థనగ్నంగా ఫోటోలకి ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు వివాదాస్పదంగా మారాయి. ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని 'గృహలక్ష్మి' సీరియల్ తో స్టార్ట్ చేసింది కస్తూరి.

గృహలక్ష్మి సీరియల్ లో తులసి(కస్తూరి) భర్త పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య, పిల్లలను పట్టించుకోకుండా ఉంటాడు. దాంతో తులసి ఇంటి బాధ్యతలు తీసుకొని ఇంటిని క్రమపద్ధతిలో ఉంచుతుంది. అటు భర్తని ఇబ్బంది పెట్టకుండా, ఇటు అత్త మామలను తల్లితండ్రులుగా చూస్తూ తులసి పాత్రలో కస్తూరి ఒదిగిపోయింది. తులసి ఎవరి పై ఆధారపడకుండా తనే సొంతంగా వర్క్ చేస్తూ పిల్లలని చదివించింది. పిల్లలకి పెళ్లి చేసి ఒకానొక సందర్బంలో తనని కాదని వెళ్ళిపోయిన తన భర్త నందుకి కూడా ఆర్థిక సాయం చెయ్యడానికి కూడా వెనుకంజ వెయ్యలేదు. అలాంటి ధైర్యం ఉన్న స్త్రీ పాత్రలో కస్తూరి మెప్పిస్తుంది. గృహలక్ష్మి సీరియల్ రోజు రోజుకి ట్విస్ట్ లతో కథ ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ 1000 వ ఎపిసోడ్ సందర్బంగా సీరియల్ యూనిట్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని కస్తూరి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.