English | Telugu

Jayam serial : మందు తాగేసిన భార్య.. గదిలోకి ఎత్తుకెళ్ళిన భర్త!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -174 లో.....గంగ దగ్గరికి ఇషిక, వీరు వస్తారు. నీకు బాక్సింగ్ సెట్ కాదు అని హేళన చేసి మాట్లాడుతుంటే ఇద్దరికి గంగ వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు సూర్య వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిందని కిచెన్ లోకి వచ్చి మందు బాటిల్ లో నుండి మందుని వాటర్ బాటిల్ లో కలుపుకుంటాడు. అప్పుడే శకుంతల వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఏం లేదు పెద్దమ్మ జలుబు అయింది హాట్ వాటర్ పెట్టుకుంటున్నానని అంటాడు. నేను కషాయం ఇవ్వనా అని అడుగుతుంది. పర్లేదని సూర్య అంటాడు.

సూర్య ఆ బాటిల్ ని తీసుకొని వెళ్లి హాల్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే రుద్ర వస్తాడు. ఏంటి అన్నయ్య అలా ఉన్నావని సూర్య అడుగగా పెద్దనాన్న క్లాస్ తీసుకున్నాడని రుద్ర చెప్తాడు. రుద్రకి తినడానికి ఏదో తీసుకొని రావడానికి సూర్య వెళ్తాడు. అప్పుడే అటుగా వెళ్తున్న గంగ తనలో తను మాట్లాడుకుంటూ కనిపిస్తే రుద్ర పిలుస్తాడు. రుద్రతో గంగ మాట్లాడుతుంటే తనకి వెక్కిళ్లు వస్తాయి. దాంతో హాల్లో ఉన్న బాటిల్ లో ఉన్నవి వాటర్ అనుకొని గంగకి రుద్ర ఇవ్వగా తను తాగుతుంది. ఇక ఆ తర్వాత తాగి మైకంలో మాట్లాడుతుంది. ఏంటి ఇలా బెహేవ్ చేస్తుందని రుద్ర అనుకుంటాడు. అప్పుడే సూర్య వచ్చి ఈ బాటిల్ లో వాటర్ నువ్వు తాగావా అని రుద్రని అడుగగా గంగ తాగిందని రుద్ర చెప్తాడు. అప్పుడే వంశీ వస్తాడు.

వంశీకి విషయం అర్థమవుతుంది. వంశీ, సూర్య ఇద్దరు అది మందు అని రుద్రకి చెప్తారు. దాంతో రుద్ర వెంటనే గంగ దగ్గరికి వెళ్తాడు. గంగకి గదిలోనే ఉండమని రుద్ర చెప్తాడు కానీ గంగ వినకుండా ఇషిక, వీరు దగ్గరికి వెళ్లి మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది. నువ్వు మందు తాగావ్ కదా అత్తయ్యకి చెప్తానని ఇషిక అనగానే అక్కడ దొరికిపోయేది మీ ఆయన అని వంశీ అంటాడు. సైలెంట్ గా ఉండు ఇషిక అని సూర్య చెప్తాడు. ఆ తర్వాత గంగని రుద్ర ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్తాడు. మీరంటే నాకు చాలా ఇష్టం సర్ అని గంగ అంటుంది. సరే నువ్వు పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.