Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu : కుటుంబం కోసం రామలక్ష్మి మారుతుందా.. వాళ్ళిద్దరి మనసులు ఒక్కటయ్యేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -78 లో.. సీతాకాంత్ బయటకు వెళ్తుంటే.. ఏవండీ అని రామలక్ష్మి పిలుస్తుంది. దాంతో సీతాకాంత్ తో సహా అందరు షాక్ అవుతారు. మీ షర్ట్ బటన్ దగ్గర దారం చూడండి ఎలా ఉందో అంటూ నోటితో దారం తెంపేస్తుంది. ఇలా నువు ప్రేమ చూపిస్తుంటే..‌మన గత జన్మబంధం నిజమనిపిస్తుందని సీతాకాంత్ అనుకుంటాడు.‌ అది చూసిన‌ పెద్దాయన..‌ నీ గురించి దగ్గరుండి అన్ని జాగ్రత్తలు తీసుకునే భార్య దొరకడం నీ అదృష్టమని చెప్తాడు.

ఆ తర్వాత మీరు కూర్చోండి టిఫిన్ వడ్డీస్తానని రామలక్ష్మి చెప్పగానే సీతాకాంత్ కూర్చుంటాడు. ఆ తర్వాత సిరి, ధన వాళ్ళు ఎక్కడ అని సీతాకాంత్ అడుగుతాడు. అప్పుడే లగేజ్ తో ఇద్దరు బయటకు వస్తారు. అది చూసి ఎక్కడికి అని సీతాకాంత్ అడుగుతాడు.‌ మా ఇంటికి వెళ్తున్నామని ధన అంటాడు.. ఎందుకని అని సీతాకాంత్ అడుగుతాడు. అసలు ధనని‌  అల్లుడిగా అమ్మ ఆక్సెప్ట్ చెయ్యలేదు.. చెయ్యదంటా అని సిరి అనగానే.. సీతాకాంత్ శ్రీలత దగ్గరకి వస్తాడు. ఎందుకు అలా అంటున్నావ్ అమ్మ అని అడుగుతాడు. నా కూతురు కోసం నేనంటూ కొన్ని కలలు కన్నాను.. గొప్పగా ఉహించుకున్నానని శ్రీలత అంటుంది. నువ్వే ఉహించుకున్నట్లుగానే ధనని మారుస్తాను. కానీ సిరి ఈ సిచువేషన్ లో హ్యాపీగా ఉండాలని సీతాకాంత్ చెప్తాడు.‌ సిరి, ధనలని వెళ్లకుండా సీతాకాంత్ ఆపుతాడు.

ఆ తర్వాత రామలక్ష్మి తనపై ప్రేమ చూపించడం గుర్తుకు చేసుకుంటాడు సీతాకాంత్. అప్పుడే రామలక్ష్మి కాఫీ తీసుకొని వస్తుంది. శ్రీవల్లి వాళ్ళని గమనిస్తుందని మళ్ళీ కావాలనే సీతాకాంత్ తో రామలక్ష్మి ప్రేమగా మాట్లాడుతుంది. మీ మరదలు మనల్ని చూస్తుందని పేపర్ పై రామలక్ష్మి రాసి  ఇస్తుంది. అది చూసిన సీతాకాంత్ కూడా నటిస్తాడు. శ్రీవల్లి వెళ్ళిపోయాక.. ఇంకా మీ వాళ్ళకి డౌట్ గా ఉంది.. అందుకే ఇలా యాక్ట్ చెయ్యాల్సి వస్తుందని రామలక్ష్మి అంటుంది వాళ్ళు ప్రేమగా మాట్లాడుకోవడం విన్న శ్రీవల్లి వచ్చి.. శ్రీలతకి చెప్తుంది. మరొక వైపు సీతాకాంత్ పెట్టించిన జాబ్ లో జాయిన్ అవ్వడానికి మాణిక్యం సూట్ లో రెడీ అయి వెళ్తుంటే.. సుజాత ఆశ్చర్యంగా చూస్తుంది.‌ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.