English | Telugu

Karthika Deepam2 : బంటుగాడు జస్ట్ మిస్.. తన గురించి దీప నిజం తెలుసుకోగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '.. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -25 లో.. నర్సింహని దీప తీసుకొని వస్తానంటూ వెళ్ళిందని ఇంకా రాలేదని అనసూయ అంటుంది.. ఇంటిని వేళం వెయ్యాలని ఊరి పెద్దమనిషి అనగానే.. లేదు నేను వెళ్లి వాళ్ళని తీసుకొని వస్తానంటూ అనసూయ అంటుంది. నమ్మకం లేదు నువ్వు వారంలో రాకపోతే నీ ఇంటికి వేలం వేస్తామని మల్లేష్ చెప్తాడు. అందుకు ఒప్పుకుంటు అనసూయ సంతకం చేస్తుంది.

ఆ తర్వాత అందరు గుడికి వస్తారు. అక్కడ జ్యోత్స్న పేరు మీద, దీప పేరు మీద సుమిత్ర అర్చన చేయిస్తుంది. దీపని ఏదో రకంగా తక్కువ చేసి మాట్లాడడానికి పారిజాతం ట్రై చేస్తుంటే.. తనపై దీప కోప్పడుతుంది. ఆ తర్వాత శౌర్యకి గుడిలో గంట అందకపోతే.. చీటికె వేస్తే గంట అందుతుందని శౌర్యా అంటుంది కార్తీక్ అని శౌర్య అనగానే.. శౌర్యని కార్తిక్ ఎత్తుకొని గంట కొట్టిస్తాడు.. ఆ తర్వాత బంటు, ఇంకా సుమిత్రపై ఎటాక్ చేసినవాడు మాట్లాడుకోవడం దీప చూసి.. వెంటనే సుమిత్ర వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తుంది. వెంటనే అందరు కలిసి అక్కడికి వెళ్తారు. అప్పుడే ఆ రౌడీ బంటుతో మాట్లాడి వెళ్ళిపోతాడు. బంటు కాలర్ పట్టుకొని.. ఇందాక మాట్లాడినవాడు ఎక్కడ అని కార్తిక్ అడుగుతాడు. వెళ్ళిపోయాడని బంటు చెప్తాడు. వాడు ఎవడు? వాడితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావని కార్తీక్ అడుగుతుంటే.. ఎక్కడ నిజం చెప్తాడో అని పారిజాతం భయపడుతుంది. వాడి సంగతి నేను చెప్తానంటూ కార్తీక్ ని పక్కకి వెళ్ళమని.. చెప్పారా అంటు బంటుని కొడుతుంది పారిజాతం. ఒకవైపు నిజం చెప్పొద్దంటూ రిక్వెస్ట్ చేస్తుంది.

ఆ తర్వాత వాళ్ళెవరో నాకు తెలియదు అడ్రెస్ కావాలంటే చెప్పానని బంటు చెప్తాడు. ఆ రౌడీ మనల్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళాలని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక బంటుని పారిజాతం తిడుతుంటుంది. మరొకవైపు జ్యోత్స్న బర్త్ డే కి స్పెషల్ ఐటమ్స్ అన్నీ దీప రెడీ చేస్తుంది. తనకి హెల్ప్ చేస్తూ తన గురించి తెలుసుకోవాలని సుమిత్ర అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.