English | Telugu

Eto Vellipoyindhi Manasu : భార్యకు సేవలు చేయడం మొదలెట్టిన సీతాకాంత్.. అందరిని గుప్పిట్లో పెట్టుకో!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -59 లో.. సీతాకాంత్ వాళ్లు టిఫిన్ చేస్తుంటే రామలక్ష్మిని సిరి తీసుకొని వస్తుంది. మా అన్నయ్య పక్కన కూర్చొని తినమని సిరి చెప్పగానే.. ఇబ్బంది పడుతూనే రామలక్ష్మి వెళ్లి సీతాకాంత్ పక్కన కూర్చుంటుంది. రామలక్ష్మికి సీతాకాంత్ టిఫిన్ వడ్డీస్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తారు.

ఇప్పుడే నీ భార్యకు సేవలు చెయ్యడం మొదలు పెట్టావా అంటు.. వాళ్ళ తాతయ్య అంటాడు. అవును అమ్మ రాలేదు ఏంటని సందీప్ ని సీతాకాంత్ అడుగుతాడు. మనసు బాగోలేదని రానని చెప్పిందని సందీప్ అనగానే.. సరే మీరు టిఫిన్ చెయ్యండి అంటూ శ్రీలత దగ్గరికి సీతాకాంత్ వెళ్తాడు. పైకి కనిపించేంతగా సీతా సర్ కోపంగా ఉండరు. ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తారని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి సీతాకాంత్ వెళ్లి టిఫిన్ చెయ్యడానికి రమ్మని అంటాడు. ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు. నీ గురించే ఆలోచిస్తున్నాను.. అసలు నువ్వు రామలక్ష్మిని పెళ్లి చూసుకున్నావా? అంత శత్రువు కూతురిని పెళ్లి చేసుకుంటావని నేను అనుకోవడం లేదు? నా మీద ఒట్టేసి చెప్పని శ్రీలత అంటుంది. అంటే నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదా ఇంకొకసారి ఒట్టు వెయ్యమని అనకు మనసుకి చాలా కష్టంగా ఉంది. ధన, సిరిల పెళ్లి కోసమే మేమ్ పెళ్లి చేసుకున్నామని సీతాకాంత్ చెప్పి వెళ్ళిపోతాడు. నువు చేసుకోలేదని తెలుసు. ఆ విషయం ఎలా బయటకు తీసుకొని రావాలో.. నాకు తెలుసని శ్రీలత అనుకుంటుంది.

ఆ తర్వాత మాణిక్యం, ధన, సుజాత కలిసి సీతాకాంత్ వాళ్ళింటికి వస్తారు. సీతాకాంత్ కి సెక్యూరిటీ ఫోన్ చేసి లోపలికి పంపించమంటారా అని అడుగుతాడు. వద్దని సీతాకాఙత్ చెప్పగానే.. సెక్యూరిటీ వారిని లోపలికి పంపించడు. అప్పుడే సీతాకాంత్ పై నుండి చూస్తు ఉంటాడు. నన్ను ఎందుకు లోపలికి వద్దంటున్నావని మాణిక్యం అంటాడు. మొన్న నన్ను అవమానించావ్ కదా అందుకే అని సీతాకాంత్ అంటాడు‌. ఇంకెప్పుడు అలా చెయ్యనని మాణిక్యం అనగానే లోపలకి రమ్మని చెప్తాడు. ఇంట్లో అందరు నువ్వు చెప్పినట్టు వినేలా చేసుకోమని రామలక్ష్మితో మాణిక్యం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.