English | Telugu

Eto Vellipoyindhi Manasu : జైలు నుండి బయటకు తీసుకొచ్చింది మా అన్నయ్యే.. షాక్ లో శ్రీలత!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -316 లో.... సందీప్ ధన ఇద్దరు బయటకుకి వస్తారు. నేను చేసిన ప్రయత్నం ఫలించిందని రాజీవ్ అంటాడు. అంటే మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చింది మీరా అని సందీప్ అంటాడు. అవునని చెప్పగానే రాజీవ్ కి ఇద్దరు థాంక్స్ చెప్తారు. సరే మళ్ళీ కలుద్దామంటూ రాజీవ్ వెళ్ళిపోతాడు. ధన, సందీప్ లు ఆటో కోసం చూస్తుంటే అప్పుడే రామలక్ష్మి వస్తుంది. వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఏంటి వీళ్ళు బయటకు వచ్చారని అనుకుంటుంది. వెళదాం పదా మనలాంటి వాళ్ళు డబ్బు ఇస్తేనే కదా వాళ్ళ కడుపు నిండేది అని ధనతో సందీప్ అంటాడు. ఇద్దరు రామలక్ష్మి ఆటో ఎక్కుతారు.

మేము ఏం తప్పు చెయ్యలేదు అందుకే బయటకు వచ్చాము.. మమ్మల్ని మీరు తప్పుగా అపార్ధం చేసుకున్నారని రామలక్ష్మితో ధన అంటాడు. ఇల్లు రాగానే రామలక్ష్మి సడెన్ గా బ్రేక్ వేస్తుంది. ఏంటి అంటూ సందీప్ అనగానే.. మీ కొంప వచ్చిందని రామలక్ష్మి అంటుంది. డబ్బులు ఇవ్వండి అని రామలక్ష్మి అనగానే.. వాళ్ళ దగ్గర ఉండవు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత సీతాకాంత్ ఇంటికి రాగానే వాళ్ళని బయటకు తీసుకొని వచ్చింది మీరే కదా అని సీతాకాంత్ పై రామలక్ష్మి విరుచుకుపడుతుంది. మరేం చేయమంటావ్ నా చెల్లి తన భర్తని విడిపించమని రిక్వెస్ట్ చేసిందని సీతాకాంత్ అంటాడు. వాళ్ళు మారరని.. సీతాకాంత్ కి ఏదయినా హాని తలపెడతారోనని రామలక్ష్మి భయపడుతుంది.

ధన, సందీప్, శ్రీలత, రాజీవ్, శ్రీవల్లి లు మాట్లాడుకుంటారు. ఆ రామలక్ష్మి, సీతకాంత్ లకి టార్చర్ చూపించాలని సందీప్ అనగానే సిరి వచ్చి.. సందీప్ చెంప చెల్లుమనిపిస్తుంది. అన్నయ్య వదిన గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చింది అన్నయ్యనే అని సిరి అనగానే.. నీకు ఎలా తెలుసని శ్రీలత అంటుంది. నాకు తెలుసని సిరి అంటుంది. అది నిజమేనా అని రాజీవ్ ని శ్రీలత అడుగగా.. అవునని రాజీవ్ తల ఊపుతాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఇప్పటికైనా అర్థమైందా అని సిరి వాళ్లకి క్లాస్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.