English | Telugu

Brahmamudi : బిజినెస్ పనిమీద అమెరికాకి కావ్య, రాజ్.. ఆస్తులన్నీ దోచుకున్నారంటూ రుద్రాణి గొడవ!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -633 లో....కావ్య వేసిన డిజైన్స్ బాగున్నాయని రాజ్ మెచ్చుకుంటాడు. ఇప్పుడు ఈ డిజైన్ ఎలా చేస్తానో చూడమని ఒకతనికి కాల్ చేసి డిజైన్ పంపిస్తాడు. అక్కడ వేళంపాట జరుగుతుంది. ఈ డిజైన్ వాళ్ళకి చూపించి.. ఇది స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ నుండి వచ్చింది ఒకటే పీస్ అని అక్కడున్నా వాళ్ళకి చెప్తాడు. అందరు పోటీ పడి మరి ఈ డిజైన్ కి వేళం పాడతారు. అదంతా రాజ్ కావ్య ఫోన్ లో వింటూ ఉంటారు. ఆ డిజైన్ కోటిన్నరకి అమ్ముడుపోతుంది. చూసావా దాని కాస్ట్ ఇరవై అయిదు లక్షలు కానీ ఎంతకీ ప్రమోట్ చేసానో చూసావా.. ఇది బిసినెస్ అంటే.. ఇప్పుడు చెప్పు డిజైనర్ గొప్పనా బిజినెస్ మ్యాన్ గొప్పనా అని రాజ్ అనగానే.. మీరే గొప్ప అని ఒప్పుకుంటున్నానని కావ్య అంటుంది.

స్వప్నకి రెంట్ డబ్బులు రెండు లక్షలు వస్తాయి. ఆ విషయం రుద్రాణి, రాహుల్ లకి తెలిసి మాకు డబ్బు కావాలి ఇవ్వమని అడుగుతారు. ఇవ్వనని స్వప్న చెప్పడంతో దీని అకౌంట్ లోని డబ్బు నా అకౌంట్ లోకి ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసని రుద్రాణితో రాహుల్ అంటాడు. రాహుల్ తెలివిగా స్వప్న ఫోన్ కి ఒక లింక్ పంపిస్తాడు. అది ఓపెన్ చెయ్యగానే మన అకౌంట్ లోకి డబ్బు వస్తుందని రాహుల్ అంటాడు. అనుకున్నట్లుగానే స్వప్న లింక్ క్లిక్ చెయ్యగానే తన డబ్బు మొత్తం రాహుల్ అకౌంట్ లోకి పడిపోతుంది. అది చూసుకొని అయ్యో డబ్బు ఎలా మా అయిందని స్వప్న కంగారుగా రాహుల్, రుద్రాణి దగ్గరికి వచ్చి నా అకౌంట్ లో డబ్బుపోయింది అంటుంది. అందుకే అన్ని లింక్స్ ఓపెన్ చెయ్యొద్దని రాహుల్ అంటాడు. నేను లింక్ ఓపెన్ చేసినట్లు తనకేల తెలుసు.. రాహుల్ ఈ పని చేసి డబ్బు లేకుండా చేసాడని స్వప్న అనుకుంటుంది. రాజ్ దగ్గరికి తన ఫ్రెండ్ వస్తాడు. మీరు వేసిన డిజైన్స్ వాళ్లకి బాగా నచ్చాయి. అందుకే అమెరికాలో మీటింగ్ ఏర్పాటు చేసాను. నువ్వు కావ్య వెళ్ళాల్సి ఉంటుందని అతను చెప్పగానే అమెరికానా అంటూ కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది.

తనని మోసం చేసి డబ్బు తీసుకున్నారని స్వప్నకి అర్థమవుతుంది. రాహుల్ మళ్ళీ తన ఫ్రెండ్ దగ్గర డబ్బు అడిగానని రుద్రాణికి చెప్తాడు. రుద్రాణి దగ్గరికి రాహుల్ వచ్చి.. నాకు ఒక యాభై వేలు కావాలని అంటుంది. లేవు ఇందాక మేము అడిగితే ఇచ్చావా అని రుద్రాణి అంటుంది. దాంతో నన్నే మోసం చేస్తారా అంటూ తను కూడా ఒక లింక్ రాహుల్ కి పంపిస్తుంద. అది రాహుల్ క్లిక్ చెయ్యగానే తన డబ్బు మొత్తం స్వప్న అకౌంట్ లోకి వస్తుంది. ఎందుకు అలా చేసావ్ రా దాని డబ్బుతో పాటు మన డబ్బు కూడా పోయిందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. స్కామార్స్ ఉంటారు కదా చూసుకోవాలి కదా అంటూ స్వప్న అనగానే.. ఈ పని చేసింది స్వప్ననే అని వాళ్ళకి అర్ధమవుతుంది. తరువాయి భాగంలో రాజ్ వీసా గురించి ఫోన్ లో మాట్లాడడం విన్న రుద్రాణి... అందరి ముందుకి వచ్చి ఆస్తులు తాకట్టు పెట్టి మరి అమెరికాకి వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటున్నారని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.