English | Telugu

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మిలు ఒక నాటకం.. సంబరపడ్డ అత్త,‌ మామ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. (Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -289 లో..... శ్రీలతతో ఛాలెంజ్ చేస్తుంది రామలక్ష్మి. నువ్వు ఎప్పటికైన మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారని అంటుంది. మీరే నా దగ్గరికి వస్తారని శ్రీలత అంటుంది . ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి నేను మర్చిపోయింది బ్యాగ్ లోనే ఉందని అంటుంది. ఆ తర్వాత ఇద్దరు బయలుదేర్తారు. చీకటి అవుతుంది నువ్వు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళు.. నేను రెండు రోజుల్లో వస్తానని సీతాకాంత్ అంటాడు. మీరు ఇక్కడ ఇబ్బంది పడుతుంటే.. నేను అక్కడికి వెళ్లి హ్యాపీగా ఉండాలా నేను వెళ్ళను.. మీరు రండి లేదంటే నేను వెళ్ళనంటుంది.

నా వల్ల రామలక్ష్మి ఇబ్బంది పడడం ఎందుకని.. పదా వస్తానని సీతాకాంత్ అనడంతో రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు సిరి దగ్గరికి ధన వచ్చి.. నేను ఏది కావాలని చెయ్యలేదు.. పరిస్థితి అలా చేయించింది. నేను వాళ్లు చెప్పినట్లు వినకపోతే మనల్ని కూడా అలాగే చేసేవాళ్ళు.. అందుకే వినాల్సి వచ్చిందని ధన అనగానే.. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళదామని సిరి అంటుంది. మీ అన్నయ్య నువ్వు కష్టపడితే చూడలేడని సిరిని కూల్ చేస్తాడు ధన. ఆస్తులన్నీ నీ పేరున ఉన్నాయ్.. కాబట్టి నీతో ఇలా ఉంటున్నాను. ఎలాగైనా ఆస్తులు నా పేరున రాయించుకోవాలని ధన కన్నింగ్ గా ఆలోచిస్తాడు.

మరొకవైపు సీతాకాంత్, రామలక్ష్మి లు ఇద్దరు మాణిక్యం ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూసి మాణిక్యం సుజాతలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి అల్లుడు గారు అలా ఉన్నారని మాణిక్యం రామలక్ష్మిని అడుగుతాడు. ఏం లేదంటూ రామలక్ష్మి జరిగింది చెప్పదు. ఆ తర్వాత అల్లుడు గారు ఏం తినలేదని సుజాత అనగానే.. పింకీ, రామలక్ష్మిలు ఒక నాటకం ఆడి ఎలాగైనా సీతాకాంత్ భోజనం చేసేలా చేస్తారు. సీతాకాంత్ రామలక్ష్మిలని చూసి మాణిక్యం, సుజాతలు మురిసిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.