English | Telugu

'కార్తీక‌దీపం' హిమ ఇంటికి ఈట‌ల ఎందుకు వ‌చ్చారు?!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ టాపిక్ వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా సోషల్ మీడియాలో 'కార్తీకదీపం' హిమ తెగ హల్చల్ చేస్తోంది. మాములుగా 'కార్తీకదీపం' సీరియల్ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. రీసెంట్ గా 'ఆర్ఆర్ఆర్' పోస్టర్‌ను సైతం 'కార్తీకదీపం' స్టైల్ లోకి మార్చి మీమ్స్ క్రియేట్ చేశారు. ఈ సీరియల్ మాత్రమే కాదు.. అందులో నటీనటులు కూడా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు.

ముఖ్యంగా చిన్నపిల్లల పాత్రలు పోషిస్తున్న హిమ (సహృద), శౌర్య (కృతిక) సోషల్ మీడియాలో చేసే అల్లరి మాములుగా ఉండదు. సహృద ఈ మధ్యకాలంలో తన డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. మాస్ స్టెప్పులతో తన ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా సహృద.. తెలంగాణా మాజీ మినిస్ట‌ర్‌, ఇటీవ‌లే బీజేపీలో చేరిన‌ ఈటల రాజేందర్‌తో కలిసి తీసుకున్న ఫోటోని షేర్ చేసింది.

అసలు ఇప్పుడు తెలంగాణలో ఈటల రాజేందర్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సహృద ఆయ‌న‌తో దిగిన‌ ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఈటల రాజేందర్ తన ఇంటికి వచ్చినట్లు చెప్పింది సహృద. కానీ ఎందుకు వచ్చారనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు. ఇదే అంశంపై నెటిజన్లు ఆమెని ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.