English | Telugu

కైలాష్ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెట్టిన వేద‌

స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్, డెబ్జాని మోడ‌క్ కీల‌క జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ న‌టించారు. పేమ‌గా తీసుకొచ్చిన గౌన్ వేసుకుంటే య‌ష్ చెప్పాపెట్టకుండా ముంబై వెళ్లిపోయాడ‌ని వేద ఫీల‌వుతూ వుంటుంది. అయితే య‌ష్ మాత్రం త‌న ద‌గ్గ‌రికే వ‌చ్చి ష‌ర్ట్ బ‌ట‌న్ ఊడింద‌ని చెబుతాడు.

ఆ త‌రువాత నేను కుట్టేస్తాను గా అంటూ వేద బ‌ట‌న్ కుట్ట‌డం మొద‌లు పెడుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ మూడ్ మొద‌ల‌వుతుంది. క‌ట్ చేస్తే.. వేద‌ని ఆ డ్రెస్ లో చూసిన కైలాష్ భ‌లే దొరికావ్ వేద‌.. య‌ష్ రెండు రోజుల వ‌ర‌కు ముంబై నుంచి తిరిగి రాడు.. ఈ స‌మ‌యాన్ని అనుకూలాంగా మార్చుకుని నిన్ను సొంతం చేసుకోవాలి అని ప్లాన్ చేస్తాడు. వేద ఒంట‌రిగా వున్న స‌మ‌యం చూసుకుని త‌న బెడ్రూమ్ లోకి ప్ర‌వేశిస్తాడు. ఆద‌మ‌రిచి వున్న వేద‌ని కౌగిలించుకుంటాడు.

ఏం జ‌రుగుతోందో ప‌సిగ‌ట్టిన వేద వెంట‌నే తేరుకుంటుంది. హాల్లోకి ప‌రుగున వ‌చ్చి య‌ష్ త‌ల్లికి విష‌యం చెప్ప‌బోతూ ఎమోష‌న‌ల్ అవుతుంది. ఏం జ‌రిగింది వేద అని య‌ష్ త‌ల్లి మాలిని అడ‌గ‌డంతో వావి వ‌రుస‌లు మ‌రిచి నన్ను కైలాష్ కౌగిలించుకుని అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌బోయాడ‌ని, నీచంగా బిహేవ్ చేశాడ‌ని ఏడుస్తూ చెబుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? కైలాష్ చేసిన ప‌నికి మాలిని ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.