English | Telugu

మేము వస్తే ఈ స్టేజీకే కల వచ్చింది..మీరు వస్తే ఈ స్టేట్ కి కళొచ్చింది సర్

ఈ దీపావళికి మాస్ జాతర పేరుతో అక్టోబర్ 20 న ఒక ప్రొగ్రమ్ రాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి నాగబాబు, శేఖర్ మాష్టర్ వచ్చారు. ఇద్దరూ స్టేజి మీదకు వచ్చారు. "ఏదేమైనా శేఖర్ నువ్వొచ్చాక ఈ స్టేజికి అద్భుతమైన కళ వచ్చింది" అంటూ నాగబాబు శేఖర్ మాష్టర్ ని పొగిడేసాడు. వెంటనే శేఖర్ కూడా "మేమొస్తే ఈ స్టేజీకే కళ వచ్చిందేమో మీరొస్తే ఈ స్టేట్ కె కళొచ్చింది సర్" అని చెప్పాడు. ఇక ఆది వచ్చి శేఖర్ మాష్టర్ కి, నాగబాబు కొత్త వస్త్రాలున్న పాక్స్ ని ఇచ్చాడు. శేఖర్ మాష్టర్ ఐతే ఆ పాక్ చూసి "ఈ కలర్ బాబు గారికి సెట్ అవుతుంది.

నువ్వు వెళ్లి ఇది చెప్పి ఆ కవర్ తీసుకుని ఈ కవర్ ఇచ్చేయి" అని చెప్పాడు. అదే విషయాన్నీ ఆది వెళ్లి నాగబాబుకు చెప్పాడు. "బాబు గారు ఈ కవర్ శేఖర్ మాష్టర్ కి ఇచ్చేద్దాం అడుగుతున్నాడు" అన్నాడు. "అడగటానికి ఆడేవాడు..చెప్పడానికి నువ్వు ఎవడవురా" అన్నారు నాగబాబు. "నేనొక జడ్జిగా చెప్తున్నా ఈ కలర్ నీకు బాగుంటుంది" అంటూ నాగబాబు చెప్పారు. "నేను కూడా జడ్జ్ గానే చెప్తున్నా సర్ ఈ కలర్ మీకు బాగుంటుంది" అన్నాడు. "జడ్జ్మెంట్ వరకు వచ్చావంటే నువ్వు బెటర్ జడ్జ్ ఆ, నేను బెటర్ జడ్జ్ ఆ తేల్చుకుందాం ఈరోజు" అంటూ పందెం కాసుకున్నారు. "తేల్చుకుందాం అంటే తేల్చుకుందాం సర్" అంటూ శేఖర్ మాష్టర్ దాక్కునే సరికి.."తేల్చుకుందాం అంటూ వెనక్కి వెళ్తున్నావేంటి" అంటూ నాగబాబు అడిగారు. "ఏంటి సర్ ముందుండే తేల్చుకోవాలి ఏంటి దూరం నుంచి తేల్చుకోకూడదా ఏంటి" అంటూ కౌంటర్ వేసాడు శేఖర్ మాష్టర్. అలా ఇద్దరూ వాళ్ళ వాళ్ళ పాక్స్ ని విసిరిగొట్టి తేల్చుకుందాం పదా అనుకున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.