English | Telugu

కన్నీళ్లు పెట్టుకున్న డాన్సర్ చక్రపాణి...షూ గిఫ్ట్ గా ఇచ్చిన అతని వైఫ్

"ఢీ " ప్రీమియర్ లీగ్ లేటెస్ట్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా రిలీజ్ అయింది. ఈ షోకి ఈ వారం బిగ్ బాస్ సీజన్ - 4 లో అందరి మనసులను దోచుకున్న సయ్యద్ సోహల్ తన బ్లాక్ బస్టర్ మూవీ "మిస్టర్ ప్రెగ్నంట్" ప్రోమోషన్స్ కోసం వచ్చాడు. అలాగే హైపర్ ఆది "పెద్దరాయుడు" గెటప్ వేసి అందరిని గుడుపుబ్బ నవ్వించాడు. కొరియోగ్రాఫర్ అభి వచ్చి "అదెంటీ ఆది అన్న మనం ఇద్దరం కలిసి ఎన్నో సీజన్స్ చేశాం కదా" అని అడిగితే, "మరి అన్నయ్య నాకోకటి దొరికింది, ఇద్దరం కలిసి తిందాం అని ఏరోజైనా పిలిచావా" అని కామెడీ చేసేసరికి శేఖర్ మాష్టర్ పడీ పడీ నవ్వేసాడు. తరువాత సైరా రాయలసీమ్ వెర్సెస్ బెజవాడ టైగర్స్ గ్రూప్స్ మధ్య డాన్స్ కాంపిటీషన్ జరిగింది. రెండు టీమ్ డాన్సర్స్ ఇద్దరు పోటా పోటీగా చేశారు. ఇక ఈ షోలో హైలైట్ గా నిలిచాడు "చక్రపాణి". అతని గురించి ప్రదీప్ చెప్పేసరికి అందరికీ కన్నీళ్లు వచ్చేసాయి. చక్రపాణి కూడా ఏడ్చేశాడు.

"చక్రపాణికి డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. 22 ఏళ్లుగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు వచ్చినా వదలకుండా ప్రయత్నిస్తునే ఉన్నాడు. అలా తన జర్నీని కంటిన్యూ చేస్తూనే ఇక్కడి వరకు వచ్చాడు" అని చెప్పాడు ప్రదీప్. అలా తర్వాత తన భార్య పిల్లల గురించి చెప్పాడు చక్రపాణి. "నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను" అని తన భార్య భరోసా ఇచ్చిందని చెప్పాడు. ఇంతలో స్టేజి మీదకు వచ్చారు చక్రపాణి భార్యాపిల్లలు. ఇక వస్తూనే ఆమె తన భర్త చక్రపాణికి మంచి కాస్ట్లీ షూ గిఫ్ట్ గా ఇచ్చారు. తరువాత నెల్లూరు నెరజాణలు వెర్సెస్ కొనసీమ పందెంకోళ్ళకి మధ్య పోటీ జరిగింది. ఇంతలో హైపర్ ఆది అదరిపోయే స్కిట్ చేసి, అందరిని నవ్వించాడు. ప్రైజ్ మీద ఉన్న ప్రదీప్ అలాగే డాన్నర్లు అందరూ ఆ స్కిట్లో మైద్యుడు. ఆ డాన్స్ పోటీలో ఎవరూ గెలుస్తారో వేచి చూడాలి. ఇక చివరిలో అన్ని గ్రూప్స్ కలిసి స్టేజి మీద డాన్స్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాయి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.