English | Telugu

ఢీ సెలబ్రిటీ స్పెషల్ షో ఆడియన్స్ ముందుకు!

ఢీ సెలబ్రిటీ స్పెషల్ షో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ షో అంతా కొత్తకొత్తగా ఉంది.. పాత వాళ్లంతా ఈ షోకి బైబై చెప్పేసారు. ఈ ఢీ సీజన్ 17 కి యాంకర్ గా నందు బ్లాక్ కలర్ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చాడు. అలాగే జడ్జెస్ లో శేఖర్ మాష్టర్ మాత్రమే ఉన్నారు. ఇక లేడీ జడ్జి ఉన్న పూర్ణ ప్లేస్ లో కన్నడ నటి "బావ" మూవీ హీరోయిన్ గా ప్రణీత సుభాష్ ని తీసుకొచ్చారు.

ఇక డాన్సర్స్ కూడా అందరూ లేడీస్ ఎక్కువగా కనిపించారు. ఇక ఈ షో మెగా లాంచ్ కాబోతోంది. ఈ లాంచ్ ఈవెంట్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా ఉంది. ఈ ఈవెంట్ కి "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" మూవీ టీమ్ కూడా వచ్చి నందుతో కలిసి డాన్స్ వేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఇక స్టేజి మీద ఒక భవిష్య వాణి పుస్తకం కనిపించేసరికి ఆది వచ్చి ఆ విరూపాక్ష శాసనాల గ్రంథమా అంటూ హడావిడి చేసాడు. ఈ బుక్ లో నా పేరు మీద ఏదో రాసి ఉందంటూ చదవడం స్టార్ట్ చేసాడు.." ఈ సీజన్ మొత్తం ఈ బుక్ ఏది చెప్తే అదే నువ్వు ఫాలో అవ్వాలి. ఈ ఎపిసోడ్ మొత్తం నువ్వు జడ్జిలా బిహేవ్ చేయాలి.." అనేసరికి ఆది వెళ్లి శేఖర్ మాష్టర్ పక్కన కుర్చీ వేసుకుని సెటిల్ ఐపోయాడు. శ్వేతా నాయుడు, శ్రీ ప్రియా, గలాటా గీతూ, కార్తీక దీపం హిమ అలియాస్ సహృద వచ్చి డాన్స్ వేసి అందరినీ అలరించారు. ఇక శ్వేతా నాయుడు గ్రీన్ కలర్ డ్రెస్ లో వచ్చి చేసిన హాట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి స్టేజి మొత్తం హీటెక్కిపోయింది. సహృద కూడా ఇరగదీసే డాన్స్ వేసి అందరి చేతా వావ్ అనిపించుకుంది. ఈ పెర్ఫార్మెన్స్ హైలైట్ అంటూ ప్రణీత్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చేసారు. "ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం .. చేరనీ ఫైనల్స్ వరకు కర్పూర దీపం" అంటూ సహృద డాన్స్ కి కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.