English | Telugu

"మనసులో నువ్వే ఉన్నావ్ అమ్మాడి" అంటూ సుమతో చెప్పిన సల్మాన్

క్యాష్ ప్రోగ్రాం లేటెస్ట్ ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ షోకి సీతారామం టీం వచ్చేసింది. దుల్కర్ సల్మాన్, తరుణ్ భాస్కర్, సుమంత్ ఈ షోకి వచ్చేసారు. ఇక సల్మాన్ ని చూసేసరికి ఆడియన్స్ అరుపులు అన్నీ ఇన్ని కావు. అందరి నోళ్లు మూయించి చివరికి నేను మీకు పెద్ద ఫ్యాన్ అని అంటుంది సుమ. అందరూ నవ్వేస్తారు. తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఇక్కడ ఎమోజిఎస్ తో ఎక్కువగా మెసేజెస్ చేసేది ఎవరు అని అడుగుతుంది సుమ. సుమంత్ తాను చేస్తానని చెప్తాడు. మనసులో ఏముందో ఎమోజిలో అది కనిపిస్తుందా అని అడుగుతుంది. మనసులో ఏమీ ఉండదు, నా మనసు బండరాయి అంటాడు. తర్వాత సుమన్ ని పక్కకు పిలిచి నిలబెట్టి వెనక స్క్రీన్ మీద మల్లెపూలు ఇమేజ్ ని చూపించి ఆ బొమ్మను అభినయించి చూపించాలని తరుణ్ భాస్కర్ కి చెప్తుంది.

భాస్కర్ కూడా కరెక్ట్ గా చేసి చూపిస్తాడు సుమంత్ మల్లెపూలు అని కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు. తర్వాత అలాంటిదే మరో ప్రశ్నకు సల్మాన్ ఆన్సర్ చెప్పేలా చేస్తుంది. తర్వాత సుమ సల్మాన్ ఇద్దరూ కలిసి మహానటిలో ఒక బిట్ డైలాగ్స్ తో ప్లే చేస్తారు. "మనసులో నువ్వే ఉన్నావ్ అమ్మాడి " అనే డైలాగ్ సుమ కోసం సల్మాన్ చెప్పేసరికి సుమ కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. తర్వాత కాష్ ట్రైనింగ్ స్కూల్ కి అందరిని తీసుకెళ్తుంది సుమ. మా స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటే బాగా ఫైట్స్ చేయొచ్చు అని టీమ్ కి చెప్తుంది. అలాగే ఒక ట్రైనర్ ని కూడా చూపిస్తుంది. ఆ తర్వాత ఆడియన్సు నుంచి ఒక అమ్మాయి "ప్రియతమా ప్రియతమా" అంటూ ఒక పాటను సల్మాన్ కోసం పాడుతుంది. ఇక ఈ ఎపిసోడ్ ఈ నెల 30 న ప్రసారం కానుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.