Read more!

English | Telugu

రేటింగ్ లో మొదటి స్థానంలో ‘బ్రహ్మముడి’ సీరియల్!

స్టార్ మా‌ టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ రోజు రోజుకి అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ వస్తుంది. కాగా తాజాగా విడుదైన టెలివిజన్ ప్రీమియర్ రన్ టైం వ్యూస్ లో అత్యంత ఎక్కువ మంది చూసిన సీరియల్ గా 'బ్రహ్మముడి' నిలిచింది. దీంతో ఇందులో కావ్య క్యారెక్టర్ చేస్తున్న దీపిక రంగరాజు తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో ఈ విషయాన్ని షేర్ చేసింది.

కావ్య(దీపిక రంగరాజు) తన ఇన్ స్టాగ్రామ్ స్టాటస్ లో ప్రతీ రోజు సీరియల్ లో జరిగే ఎపిసోడ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిసేలా పోస్ట్ చేస్తుంటుంది. దీంతో ఈ సీరియల్ అభిమానులు తనని ఫాలో అవుతున్నారు. అయితే ఈ సీరియల్ కి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే.. ఈ సీరియల్ లోని కనకం ఫ్యామిలీ, దుగ్గిరాల ఫ్యామిలీకి మధ్య జరిగే సంఘటనలు, సంభాషణలు. కనకం కుటుంబం ఒక మధ్యతరగతి కుటుంబం. కనకం తన ముగ్గురు కూతుళ్ళని గొప్పింటికి కోడళ్ళుగా చేయాలనే కలల కంటుంది. అయితే కనకం తన పెద్ద కూతురు స్వప్నని, దుగ్గిరాల కుటుంబ వారసుడైన రాజ్ కి ఇచ్చి పెళ్ళి చేద్దామని ముహూర్తం ఫిక్స్ చేస్తే, తను రాహుల్ తో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కనకం తన రెండవ కూతురిని పెళ్ళి పీటల మీద కూర్చోపెడుతుంది. ఆ విషయం తెలుసుకున్న రాజ్ తనని పెళ్ళి చేసుకోననగా, పెళ్ళి మండపం దగ్గర మీడియా ఉండటం వల్ల కావ్యని పెళ్ళిచేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత రాజ్ ఫ్యామిలీ పెట్టే కఠిన పరీక్షలను కావ్య ఎదుర్కొంటు వస్తుంది. ఇలా రోజు రోజుకి ఈ సీరియల్ పై ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు మేకర్స్. 

స్డార్ మా టీవీలో వచ్చే అన్ని సీరియల్స్ లో 'బ్రహ్మముడి' మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో 'గుప్పెడంత మనసు' సీరియల్ ఉండగా, మూడవ స్థానంలో 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఉంది.