English | Telugu

వరలక్ష్మి వ్రతం చేపించాలనుకున్న అత్త.. కావ్యకి స్వరాజ్ విషెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -800 లో.....అప్పు తల్లి కాబోతున్నదని తెలిసి కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పు చేత ఏం పని చేయించడు.. అదంతా కావ్య చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు నా భర్త నా పక్కన లేడని బాధపడుతుంది. అదంతా అపర్ణ, ఇందిరాదేవి చూసి ధాన్ని మనం అయిన జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటారు.

మరొకవైపు గతంలో కావ్య ప్రెగ్నెంట్ అని రాజ్ పొరపాటు పడిన విషయం గుర్తుచేసుకొని కావ్య బాధపడుతుంది. మరుసటిరోజు కావ్య అందరికి టీ లు ఇస్తుంటే ఇక నుండి నువ్వు కిచెన్ లోకి రాకు అని ఇందిరాదేవి, అపర్ణ చెప్తారు. ఏంటి ఈ రూల్ అప్పు ప్రెగ్నెంట్ అవుతుంది.. కావ్య కాదు ఎందుకు తనకి రెస్ట్ అని రుద్రాణి అంటుంది. ఇంతమంది ఉండగా నా కోడలు ఎందుకు పని చేయాలని అపర్ణ అంటుంది. ఆ తర్వాత వీళ్ళ కేరింగ్ చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది ఈ మధ్య కావ్య టాబ్లెట్ వేసుకుంటుంది.. అవి ఎందుకు వాడాతారో చూడాలని రుద్రాణి అనగానే రాహుల్ ఫోటో తీసుకొని వస్తాడు. ఆ టాబ్లెట్స్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వాడతారని రుద్రాణి అనగానే.. రాహుల్ షాక్ అవుతాడు.

ఆ తర్వాత అపర్ణ దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి.. నా కోడలు చేత వరలక్ష్మి వ్రతం చేయిస్తానంటుంది. అప్పుతో ఎందుకు ముగ్గురు కోడళ్ళతో చేయించమని అపర్ణ అంటుంది. కానీ కావ్య నా ఆశీర్వదించడానికి రాజ్ కి తెలియదు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. నేను ఏదో చేస్తాను గానీ ముందు వెళ్లి ఏర్పాట్లు చెయ్ అని అపర్ణ అంటుంది. అప్పుడే స్వరాజ్ భోజనం చేస్తాలేడని అపర్ణకి ఫోన్ చేస్తుంది రేవతి. అపర్ణతో స్వరాజ్ మాట్లాడతాడు. తరువాయి భాగం లో స్వరాజ్ నువ్వుల వెళ్లి ఆ అంటీకీ కంగ్రాట్స్ చెప్పు తన కడుపులో లో నీలాంటి బుజ్జి బేబీ ఉందని స్వరాజ్ కి చెప్పి పంపిస్తుంది రుద్రాణి. స్వరాజ్ వెళ్లి విషెస్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.