English | Telugu

Brahmamudi : ఆస్తి కోసం రుద్రాణి కన్నింగ్ ప్లాన్.. కావ్య ప్లాన్ సక్సెస్ అయ్యేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -382 లో....అనామికకి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి పని త్వరగా పూర్తి చెయ్యి.. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ కోసం అనామిక అందంగా రెడీ అవుతుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు.

ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి అనామిక వెళ్లి తన భుజంపై చెయ్యి వేసి.. నా అంతటా నేనే నీ దగ్గరికి వస్తానని చెప్పాను, వచ్చానని అనగానే.. ఎందుకు ఇంత మార్పు, నేను నీకు నచ్చినట్టు ఆఫీస్ కి వెళ్తున్నందుకా?నువ్వు నా స్థానాన్ని ఇష్టపడుతున్నావ్.. అలాంటి అనామిక వద్దు.. నన్ను అర్థం చేసుకున్నప్పుడు నా అంతటా నేనే వస్తానని కళ్యాణ్ మొహం మీద కొట్టినట్టు చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నిన్ను ఎలాగైనా నేను చెప్పినట్టు వినేలా చేసుకుంటానని అనామిక అనుకుంటుంది. మరొకవైపు రాహుల్ ఆఫీస్ నుండి వచ్చి.. నేను ఆఫీస్ నుండి టైడ్ అయి వచ్చాను.. అసలు పట్టించుకోవా అని స్వప్నతో అంటాడు. అక్కడే ఏంచేసి వచ్చావని అని రాహుల్ తో స్వప్న గొడవపడుతుంది. ఇక్కడ స్వప్న అన్న మాటలన్నీ రుద్రాణికి చెప్తాడు రాహుల్. రుద్రాణి కూడా రాహుల్ ని తిడుతుంది. ఆ తర్వాత స్వప్నని పంపించెయ్యాలని రాహుల్ అనగానే.. మా నాన్న రాసించిన ఆస్తి తింటూ కూర్చొని ఉంటుంది.. అలా కాదు ఆ ఆస్తి పత్రం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని మనం దాచుకుందాం.. ఇంట్లో వాళ్ళు అందరు స్వప్నను తిడుతారు. ఆ తర్వాత స్వప్నకి తెలియకుండా తన చేత సంతకం పెట్టిస్తానని రుద్రాణి అంటుంది. మరొకవైపు రాజ్ కి శ్వేత ఫోన్ చేసి.. గెట్ టూ గెదెర్ పార్టీ కి రమ్మని చెప్తుంది. నేను రానని రాజ్ అంటాడు. దాంతో శ్వేతకి కావ్య ఒక ఐడియా ఇస్తుంది. తన ఫ్రెండ్స్ అందరిని రాజ్ కు కాల్ చెయ్యమని చెప్పగానే.. అందరు వరుసగా ఫోన్ చేస్తుంటారు.

మరొకవైపు అపర్ణ ఫ్రెండ్ వాళ్ళింటికి వస్తుంది. తన ముందు రాజ్ పరువు తియ్యాలని రుద్రాణి చూస్తుంది. కానీ కావ్య అలా చేయకుండా అడ్డుపడుతుంది. ఆ తర్వాత ఎప్పటిలాగా ఎందుకు అలా మాట్లాడుతావంటూ రుద్రాణిపై అపర్ణ విరుచుకుపడుతుంది. ఇంత జరిగిన ఇక్కడే కావ్య ఉంటుందంటే ఆస్తులా కోసమేనని రుద్రాణి అంటుంది. అప్పుడు కావ్యకి సపోర్ట్ గా రాజ్ నిలబడతాడు. తరువాయి భాగంలో.. వెన్నెల గురించి కావ్య తెలుసుకోవడానికి గెట్ టూ గెదెర్ పార్టీకీ ఇందిరదేవికి చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.