English | Telugu

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో కీలక మలుపు.. ఆ రేవతి ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -758 లో..... స్వప్నని కాపాడడానికి కావ్య వెళ్తుంది. అప్పుడే రాజ్ ఫోన్ చేసి ఇంకా ఎప్పుడు ఇంటికి వస్తారని అడుగుతాడు. నాకు కొంచెం టైమ్ పడుతుందని కావ్య అనగానే.. ఏంటి కంగారుగా మాట్లాడుతున్నారు.. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి అని రాజ్ అడుగుతాడు. అదేం లేదని కావ్య అంటుంది. రాజ్ దగ్గరికి అపర్ణ, ఇందిరాదేవి వస్తారు.

తను ఎదో ప్రాబ్లమ్ లో ఉందని రాజ్ అనగానే.. తనకి ఎప్పుడు ప్రాబ్లమ్ వైఫ్ వైఫై లాగా తిరుగుతుందని ఇందిరాదేవి అంటుంది. మరొకవైపు స్వప్న వెళ్ళిన కార్ దగ్గర కి కావ్య వెళ్లి చూసేసరికి స్వప్న ఉండదు. కావ్యకి ఇంకా టెన్షన్ అవుతుంది. ఆ తర్వాత స్వప్న వెంట రౌడీలు వస్తుంటే తను ఒక దగ్గర దాక్కొని ఉంటుంది. ఒక రౌడీ స్వప్నని చూసి తనని చంపడానికి వస్తుంటే అప్పుడే కావ్య వచ్చి కాపాడుతుంది. స్వప్నని తీసుకొని కావ్య పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అంతలో ఒకావిడ స్వప్న, కావ్యలని లోపలికి లాక్కొని డోర్ వేస్తుంది.

ఆ కాపాడిన ఆమె పేరు రేవతి.. మీ వాళ్ళు ఎలా ఉన్నారని కావ్య వాళ్లని రేవతి అడుగుతుంది. మా వాళ్ళు మీకెలా తెలుసని కావ్య అడుగగా.. నాకు తెలుసు అంటూ చెప్తుంది. మీ అత్త అపర్ణ గారు చాలా మంచివారు.. ముక్కు మీద కోపం ఉంటుంది కానీ మంచిదని కావ్యతో రేవతి అంటుంది. రేవతి ఎమోషనల్ గా మాట్లాడుతుంటే.. తనకి దుగ్గిరాల కుటుంబంతో ఏదో సంబంధం ఉందని క్లియర్ గా అర్థమవుతుంది. మరొకవైపు అప్పుకి కావ్య ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.