English | Telugu

Brahmamudi : రాజ్ మనసులో మాటని కావ్యతో చెప్తాడా.. కూతురి కోసం రంగంలోకి కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -747 లో.....పెళ్లి రాట్ కి యామిని, రాజ్ పూజ చేస్తారు. ఆ తర్వాత పెళ్లి రాట్ విరిగిపోతుంది. దాంతో యామిని షాక్ అవుతుంది. ఇలా జరగకూడదు. ఈ పెళ్లి ఆపండి అని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. అలా ఎందుకు అండి అని పంతులు గారు అంటాడు. దాంతో అపర్ణ, ఇందిరాదేవి డిస్సపాయింట్ అవుతారు.

ఆ తర్వాత ఇలా జరుగుతుంది ఏంటని అపర్ణ, ఇందిరాదేవి మాట్లాడుకుంటుంటే అప్పుడే కనకం ఎంట్రీ ఇస్తుంది. నా కూతురు కి అన్యాయం జరుగుతుందని అంటుంది‌‌ ఇంతకి ఆ యామిని ఎవరు అంటూ నిలదీస్తుంది. కనకం నువ్వు ఎక్కువ మాట్లాడకు.. ఈ పెళ్లి ఎలాగైనా మనం ఆపాలని ముగ్గురు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కావ్య దగ్గరికి కనకం వెళ్తుంది. ఏంటే ఇదంతా అని అడుగుతుంది. కావ్య ఎప్పటిలాగే తనకేం పట్టనట్లు ఉంటుంది.

ఆ తర్వాత కావ్యతో రాజ్ మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటే యామిని అసలు రాజ్ కి ఛాన్స్ ఇవ్వదు. మరొకవైపు పూజకి పంతులు ఏర్పాట్లు చేస్తుంటాడు. కనకం, ఇందిరదేవి, అపర్ణ ముగ్గురు కలిసి పెళ్లి చెడగొట్టాలని ప్లాన్ చేస్తుంటారు. మనకి ఆ పంతులు వీక్ పాయింట్ తెలిస్తే ఆటోమెటిక్ గా మనం అనుకున్నది జరుగుతుందని కనకం అంటుంది. తరువాయి భాగంలో కావ్యతో తన మనసులో మాట చెప్పాలని రాజ్ ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.