English | Telugu

Brahmamudi : రాజ్ కి గతం గుర్తుచేసే ప్రయత్నంలో కళ్యాణ్, అప్పు.. రుద్రాణి పసిగట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -712 లో... కావ్యతో రాజ్ రిసార్ట్ కి వెళ్తున్నాడని యామిని అనుకుంటుంది. కావ్యకి ఫోన్ చేసి నీ వైపుకి తిప్పుకోవాలనుకుంటున్నావు.. నేను నీ ప్లాన్ చెడగొడతానంటూ కావ్యతో యామిని ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ తో ఫోన్ లో మాట్లాడుతుంది కావ్య. రిసార్ట్ లో అన్ని ఏర్పాట్లు చేసావా అని కనుక్కుంటుంది. కావ్య రెడీ అయి హాల్లోకి వచ్చి అపర్ణ వాళ్ళకి చెప్తుంది. ఇదేం విడ్డురం రాజ్ లేడని బాధపడకుండా అలా తిరుగుతుందని రుద్రాణి అంటుంటే.. తన మాటలు పట్టించుకోకుండా కావ్య బయల్దేర్తుంది.

కావ్య వెనకాలే రాహుల్, రుద్రాణి వస్తారు. ఏంటి అలా డౌట్ గా చూస్తున్నారని కావ్య అడుగుతుంది. నీకు పార్టీ కల్చర్ నచ్చదు కదా మరి ఎందుకు వెళ్తున్నావని రాహుల్ అడుగుతాడు. నాకు అన్ని నచ్చుతాయని కావ్య సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. దీన్ని అంత తేలికగా వదలకూడదు. ఎక్కడికి వెళ్తుందో కనుక్కోమని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత రాజ్, కావ్య ఒకే కార్ లో రిసార్ట్ కి బయల్దేర్తారు. మరొకవైపు కళ్యాణ్, అప్పు కలిసి రిసార్ట్ దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తారు. సందీప్ తన భార్యకి రాజ్ గురించి చెప్తారు. తన ఫ్రెండ్స్ కి రాజ్ గురించి చెప్తారు.

తరువాయి భాగంలో కావ్య రాజ్ రిసార్ట్ కి చేరుకుంటారు. అప్పుడే కళ్యాణ్, అప్పు ఇద్దరు రాజ్ ని కలిసి మాట్లాడుతారు. నిన్ను అన్నయ్య అనుకుంటున్నానని కళ్యాణ్ అనగానే.. సరే నిన్ను తమ్ముడు అనుకుంటానని రాజ్ అంటాడు. అప్పు, కళ్యాణ్, కావ్య కలిసి రాజ్ కి గతం గుర్తుచేసే ప్రయత్నం చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.