English | Telugu

Karthika Deepam 2 : అసలైన వారసురాలు దాస్ కి తెలుసు.. సాక్ష్యాలని కాల్చేసిన జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -348 లో... దాస్ ని చూడడానికి పారిజాతం వస్తుంది. ఏంట్రా రమ్మని చెప్పావ్.. నువ్వు అలా రమ్మంటే దాస్ కి గతం గుర్తు వచ్చిందేమో అనుకున్నానని కాశీతో పారిజాతం అంటుంది. అప్పుడే అక్కడున్న దాస్.. నేనేం మర్చిపోలేదని అంటాడు. అయితే నిన్ను కొట్టింది ఎవరో చెప్పమని దాస్ ని పారిజాతం అడుగుతుంది. ఏమో అని దాస్ అంటాడు.

ఆ తర్వాత దాస్ లోపలికి వెళ్ళాక.. నాన్న గుర్తు వచ్చినప్పుడు ఏదో రాస్తున్నాడని కాశీ చెప్తాడు. ఆ పేపర్స్ తీసుకొని వచ్చి పారిజాతం కి చూపిస్తాడు. ఆ పేపర్ లో ఉంది చదివి పారిజాతం షాక్ అవుతుంది. అసలైన వారసురాలు అంటూ పేపర్ లో ఉంటుంది. అంటే అసలైన వారసురాలు గురించి దాస్ కి తెలిసిందా అని పారిజాతం అనుకుంటుంది. ఈ పేపర్స్ అన్ని తీసుకొని వెళ్తాను. అర్ధం చేసుకొని చెప్తానని పారిజాతం తీసుకొని వెళ్తుంది.

ఆ తర్వాత పారిజాతం ఇంటికి వెళ్లి పేపర్స్ లో ఉన్న వాటిని భూతదం పెట్టి చూస్తుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి అదేంటని అడుగుతుంది. దాస్ గుర్తు వచ్చినప్పుడల్లా ఏదో రాస్తున్నాడని పారిజాతం అంటుంది. దాంతో జ్యోత్స్న ఆ పేపర్స్ తీసుకొని చదువుతుంది. అది చూసి షాక్ అవుతుంది. అంటే దాస్ కి అసలైన వారసురాలు తెలిసింది.. అదే విషయం దశరథ్ కి చెప్పాలనుకుంటున్నాడు.. ఒకవేళ దాస్ నిజం చెప్తే నీకు నష్టం.. నాకు నష్టం.. నా కొడుకు కాబట్టి నేను వాడిని ఏం చెయ్యను.. ఇక నువ్వే కొట్టించుంటావని పారిజాతం అంటుంది. నేనెందుకు కొడుతానంటూ పారిజాతాన్ని జ్యోత్స్న డైవర్ట్ చేసి పేపర్స్ తీసుకొని పంపిస్తుంది.

ఈ పేపర్స్ ఎవరన్నా చూస్తే ప్రాబ్లమ్ అని జ్యోత్స్న వాటిని కాల్చేస్తుంది. అలా జ్యోత్స్న కాల్చేయడం పారిజాతం చూసి షాక్ అవుతుంది. నువ్వేదో దాస్తున్నావ్.. అది కనిపెట్టాలి.. నా కొడుకుని గాని నువ్వు కొట్టి ఉంటే నిన్ను వదిలి పెట్టనని పారిజాతం అనుకుంటుంది. మరొకవైపు అసలు అలా ఎలా షూట్ చేసారని కార్తీక్, దీప ఆలోచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.