English | Telugu

Brahmamudi : ఇంటిపెద్ద ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళిద్దరు.. పాప బారసాలలో అనామిక ప్లాన్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -639 లో.....అప్పు దుగ్గిరాల ఇంటికి వస్తుంది. తనని చూసి కావ్య చాల హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా చెల్లి ఎస్సై అయిందని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి ఈ వేషం గెటప్ బాగుందని రుద్రాణి వెటకారంగా ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చెయ్యడానికి వచ్చావా అంటూ మాట్లాడుతుంటుంది. నా భార్య ఎస్సై అయింది. పెద్దల ఆశీర్వాదం తీసుకుందామని వచ్చామని కళ్యాణ్ అంటాడు. కాసేపటికి ముందుగా ఇందిరాదేవి ఆశీర్వాదం తీసుకుంటారు. అమ్మ, నాన్న ఆశీర్వాదం తీసుకోమని అపర్ణ అనగానే.. అంటే తనకి ఇష్టం ఉందో లేదో అని కళ్యాణ్ అంటాడు. నాకు నీ సంతోషం ముఖ్యమని ఆశీర్వాదం తీసుకోండి అన్నట్లుగా ముందు కి వస్తుంది. దాంతో అప్పు, కళ్యాణ్ లు ధాన్యలక్ష్మి, ప్రకాష్ ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.

ఇకనైనా ఇక్కడే అందరం కలిసి ఉందామని ఇందిరాదేవి అంటుంది. ఇంకా కళ్యాణ్ అనుకున్నది సాధించలేదు కదా.. అయినా ఎలా వస్తాడంటూ రుద్రాణి అనగానే.. చూసారా ఈ ఇంట్లో మా అమ్మతో పాటు ఇద్దరికి మేమ్ రావడం ఇష్టం లేదు.. అందుకే అందరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్న రోజు మేమ్ వస్తామని కళ్యాణ్ అంటాడు. రేపు స్వప్న కూతురు బారసాల ఉంది.. కావ్య, రాజ్ తో పాటు మీరు దగ్గర ఉండి జరిపించండి అని ఇందిరాదేవి అనగానే కళ్యాణ్ సరే అంటాడు. ఆ తర్వాత ముగ్గురు అక్క చెల్లెలు కలిసి బారసాలకి ఏర్పాట్లు చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే స్వప్న కూతురు ఏడుస్తూ ఉంటుంది. స్వప్న ఎంత ఎత్తుకున్నా కూడా పాప ఏడుపు ఆపదు. దాంతో కావ్య ఎత్తుకొని జోకొడుతూ పాట పాడుతుంది. దాంతో పాప నిద్రపోతుంది.

ముగ్గురు అక్కచెల్లెళ్ళు సరదాగా ఉండడం అపర్ణ, ఇందిరాదేవిలు చూసి మురిసిపోతారు. వాళ్ళని చూస్తుంటే నేను పెళ్లి అయిన కొత్తలో ఇక్కడికి వచ్చిన రోజులు గుర్తు వస్తున్నాయ్.. రాజ్ ని అందరు గారాబం చేసేవాళ్ళని అపర్ణ అంటుంది. కానీ ఇప్పుడు డబ్బు వల్ల కుటుంబం విచ్చినం అన్న ఆలోచన వస్తుందని ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో రుద్రాణి, అనామికలు ఫోన్ లో మాట్లాడుకుంటారు. రేపు బారసాలకి నేను ఎంట్రీ ఇస్తున్నాను.. నేను చేయబోయే దానికి అందరు బాధపడతారు.. చూడడానికి రెడీ గా ఉండమని రుద్రాణికి అనామిక చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.