English | Telugu

Brahmamudi : ఏదో దాస్తున్నారంటూ కూపీ లాగిన ఇందిరాదేవి.. కవర్ చేసిన రాజ్, కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi) సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -605 లో.... కావ్య పెత్తనం గురించి అడగండి అంటూ ప్రకాష్ ని హాల్లోకి తీసుకొని వస్తుంది ధాన్యలక్ష్మి. అన్నయ్య ఒక విషయం చెప్పాలి.. కావ్య వల్ల చాలా మంది బాధపడుతున్నారని రుద్రాణి, ధాన్యలక్ష్మి లు బయటపడుతున్నారు కానీ మిగతా వాళ్లు బయట పడట్లేదని ప్రకాష్ అంటాడు. ఏంటి నా కోడలిపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా అని సుభాష్ అంటాడు.

అప్పుడే సుభాష్ కి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది. ఇంకా మీ నాన్న గారి హాస్పిటల్ బిల్ పే చేయలేదని చెప్తారు.దాంతో కావ్యని పిలుస్తాడు సుభాష్. ఏంటి అమ్మ హాస్పిటల్ బిల్ క్లియర్ చెయ్యలేదు అంట అని అడుగుతాడు. కావ్య టెన్షన్ పడుతుంది. అంటే మావయ్య గారి హాస్పిటల్ బిల్ కూడా అనవసరం అనుకున్నావా లేక అంత ఖరీదైన వైద్యం ఎందుకు అనుకున్నావా అని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే రాజ్ వచ్చి అందరు కావ్యని ఎందుకు తప్పు పడుతున్నారని అడుగుతాడు. దానికి నేను సమాధానం చెప్తాను. రాహుల్ సీఈఓ గా ఉన్నప్పుడు అన్ని మిస్టక్స్ ఉన్నాయ్. అందుకే ఆడిట్ చేపిస్తున్నాను.. అందుకే ట్రాన్సక్షన్స్ అన్ని ఆగిపోయాయని రాజ్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత నేను తాతయ్య బిల్ పే చేస్తానని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత ఇందిరాదేవి దగ్గరికి కావ్య వస్తుంది. ఏంటి అమ్మమ్మ నాపై కోపంగా ఉందా అని అడుగుతుంది. కోపం ఏమీ లేదు కానీ మన దగ్గర అయిదు లక్షలు కూడ లేవా.. మీరేదో దాస్తున్నారనిపిస్తుంది కంపెనీనీ కాపాడే క్రమంలో సతమతమవుతున్నారని, మాకు చెప్పలేకపోతున్నారనిపిస్తుందని ఇందిరాదేవి అనగానే.. అదేం లేదని కావ్య కవర్ చేస్తుంది.

మరొకవైపు రాజ్ దగ్గరికి సుభాష్ వచ్చి.. ఏదైనా ప్రాబ్లమ్ ఉందా ఎందుకు టెన్షన్ పడుతున్నావంటు అడుగగా.‌. అదేం లేదని రాజ్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేసావా.. కావ్య టెన్షన్ పడుతుంటే రాజ్ వచ్చి ఏదో కవర్ చేసాడు అనిపించిందని ధాన్యలక్ష్మితో రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో కావ్య ఇంట్లో ఉన్న కార్లన్నీ పంపిస్తుంది. అది చూసిన రుద్రాణి, రాహుల్ ఇంట్లో గొడవ చెయ్యాలనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.