Read more!

English | Telugu

Brahmamudi : ఆ వేడుకలో విడాకుల గురించి రాజ్ అందరిముందు చెప్పగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. కావ్య దగ్గరకి ఇందిరాదేవి వస్తుంది. రాజ్ ఏం నిర్ణయం తీసుకున్నాడోనని కావ్య టెన్షన్ పడుతుంటే.. అంతా మంచి జరుగుతుందిలే.. నువ్వేం టెన్షన్ పడకని కావ్యకి ఇందిరాదేవి దైర్యం చెప్తుంది.

ఆ తర్వాత అనామిక, ధాన్యలక్ష్మి, రాహుల్, రుద్రాణి ఒక దగ్గర కూర్చొని ఉంటారు. దుష్ట చతుస్టయమ్ అంతా ఒకే దగ్గర కూర్చొని ఉన్నారా అని ప్రకాష్ అంటాడు. ఏంటి ఏదో అన్నారని ధాన్యలక్ష్మి అనగానే.. ఏదో తిట్టినట్టు ఉన్నాడని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత క్యాటరింగ్ వాళ్ళకి ప్లేస్ చూపించావా అని ప్రకాష్ ని అపర్ణ అడుగుతుంది. మర్చిపోయానని ప్రకాష్ అనగానే ఇలా అయితే ఎలా అని అపర్ణ అంటుంది. చూసారా టైమ్ దొరికితే మామయ్య గారిని ఎలా అంటున్నారోనని అనామిక అంటుంది. అది విన్న ఇందిరాదేవి ఇప్పుడు ఏమైంది?  అన్నాడని అలా అంటున్నావని అనామికపై ఇందిరాదేవి విరుచుకుపడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ కేక్ సెట్ చేస్తూ కింద పడేస్తాడు. అది చూసి అలా ఎందుకు చేసావ్? చూసుకోవాలి కదా అని అపర్ణ అనగానే.. ఎందుకు వాడిని అలా అంటున్నావంటు ధాన్యలక్ష్మి వస్తుంది. ఆ తర్వాత అపర్ణ అందరిపై కోప్పడుతుంది. పెద్దమ్మకి నన్ను అనే హక్కు ఉంది.. మరి మీరెందుకు మధ్యలో వస్తున్నారని ధాన్యలక్ష్మితో కళ్యాణ్ అంటాడు. మరోవైపు కావ్య మాటలని రాజ్ గుర్తుకుచేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కనకం తన ఫ్యామిలీని తీసుకొని దుగ్గిరాల ఇంటికి వస్తుంది. అది చూసిన ధాన్యలక్ష్మి, అనామిక, రుద్రాణి కలిసి వాళ్ళని అవమానిస్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి.. అప్పు వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంటే అనామికకి కోపం వస్తుంది.

ఆ తర్వాత కావ్య సెలెబ్రేషన్స్ దగ్గరకి వస్తుంది. ఆ తర్వాత రాజ్ వచ్చి డివోర్స్ గురించి అందరికి చెప్తాడు. నేను కావ్యకి డివోర్స్ ఇవ్వను.. తను నా భార్య అంటూ వేలికి రింగ్ తొడుగుతాడు. తీరా చూస్తే అదంతా కావ్య ఉహించుకుంటుంది. ఆ విషయం ఇందిరాదేవికి కావ్య చెప్పగానే.. నీ ఊహ నిజం కావాలని‌ ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.