English | Telugu

Brahmamudi:ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.. భార్య ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -296 లో....దుగ్గిరాల కుటుంబం మొత్తం భోజనం చేసి హాల్లో కూర్చొని ఉంటారు. పాయసం ఇయ్యడం మర్చిపోయానని కావ్య అందరికి పాయసం ఇస్తుంది కానీ అపర్ణ వద్దని అంటుంది. అలాగే ధాన్యలక్ష్మి విషం కక్కే వాళ్ళు పాయసం ఇచ్చిన విషం లాగే ఉంటుందని అనడంతో కావ్య బాధపడుతుంది.

ఆ తర్వాత ఆ మాటలు విన్న రాజ్ పాయసం తిని చాలా బాగుందంటూ అపర్ణ, ధాన్యలక్ష్మికి ఇస్తాడు. అందరు తింటున్నారా అని అడుగుతాడు అందరము తింటున్నామని అనామిక అంటుంది. ఎప్పుడు నానమ్మ చెప్తుంది ఉమ్మడి కుటుంబం అంటే ఇలా ఉండాలని అంటు ఉమ్మడి కుటుంబం యొక్క గొప్పతనం రాజ్ అందరికి చెప్తాడు. మరోవైపు అప్పు చికెన్ వండి అందరిని పిలిచి వడ్డిస్తుంది. తను తినబోతు కళ్యాణ్ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకొని బాధపడి తినకుండానే వెళ్లిపోతుంది. అలా అప్పు వెళ్లిపోవడం చుసిన కనకం, కృష్ణమూర్తి, అన్నపూర్ణలు బాధపడతారు. మరొక వైపు దుగ్గిరాల ఫ్యామిలీ అందరు హాల్లో పడుకోవడానికి రెడీ అవుతారు. అందరు సరదగా ట్రూత్ ఆర్ డేర్ ఆడాలని అనుకుంటారు. ఆడవాళ్లు అంత ఒకవైపు మగవాళ్ళు అంత ఒకవైపుగా ఉంటారు. మొదటగా ఇందిరాదేవికి ఛాన్స్ వస్తుంది. నువ్వు బయపడిన సందర్బం చెప్పమని ఇందిరాదేవిని సీతారామయ్య అడుగగా.. తను వయసులో ఉన్నప్పుటి విషయం చెప్తుంటే అది విని అందరు సరదాగా నవ్వుకుంటారు.

ఆ తర్వాత అనామిక వంతు వస్తుంది. నా కొడుకుని ఆస్తి చూసి ప్రేమించావా? అందం చూసి ప్రేమించావా అని అనామికని ధాన్యలక్ష్మి అడుగుతుంది. తన కవితలు చూసి ప్రేమించానని చెప్తుంది. అ తర్వాత రాజ్ వంతు వస్తుంది. నువ్వు వదినకి కిస్ ఇచ్చి ప్రపోజ్ చెయ్యలని కళ్యాణ్ అంటాడు. కావ్యని ప్రపోజ్ చెయ్యడానికి రాజ్ రెడీ అవుతాడు. తరువాయి భాగంలో రాజ్, శ్వేత ఇద్దరు కలిసి ఐస్ క్రీం తింటుంటారు. అలా వాళ్ళిద్దరు తినడం కావ్య చూస్తుంది. ఆతర్వాత రాజ్ కి కావ్య ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. మీటింగ్ లో ఉన్నానని రాజ్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.