English | Telugu

Brahmamudi : కోడళ్ళిద్దరి ప్రెగ్నెంట్ పోవాలని రుద్రాణి ప్లాన్.. కావ్య కనిపెడుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -821 లో.....రేవతిని సీతారామయ్య దగ్గరికి తీసుకొని వెళ్తారు. రేవతి ఇంటికి వచ్చిందని ఎక్కడ అపర్ణకి తెలిసిపోతుందోనని ఇందిరాదేవి టెన్షన్ పడుతుంది. అప్పు, కళ్యాణ్ స్వప్న అందరు రాజ్, కావ్య చేస్తున్న ప్లాన్ కి సపోర్ట్ గా ఉంటారు. అందరు సరదాగా మాట్లాడుకుంటుంటే.. అప్పుడే అపర్ణ వస్తుంది. వెంటనే రేవతికి ముసుగు కప్పుతారు. ఇందిరాదేవి టెన్షన్ పడుతుంటే.. ఏంటి అత్తయ్య టెన్షన్ పడుతున్నారని అపర్ణ అడుగుతుంది.

మరొకవైపు స్వరాజ్ చిటికె వేసి రుద్రాణిని పిలుస్తాడు. ఏంట్రా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను రావాలా అని రుద్రాణి అనగానే నేను ఈ ఇంటికి వారసుడిని నేను చెప్పినట్టు వినాలని స్వరాజ్ అంటాడు. దొరికావురా అని రుద్రాణి ఇంట్లో అందరిని పిలుస్తుంది. ఈ బాబూ ఈ ఇంటికి వారసుడట.. నాకు ముందు నుండి ఈ బాబుపై డౌట్ ఉంది.. నాకు తెలిసి ఈ బాబు రేవతి కొడుకే అయి ఉంటాడని రుద్రాణి అంటుంది. నాకు ఇప్పుడు వాళ్ళ అమ్మ ముసుగు తీసి చూపించాలని రుద్రాణి తియ్యబోతుంటే.. వద్దని అపర్ణ ఆపుతుంది. వాళ్ళ ఆచారాన్ని ఎందుకు అలా చేస్తావని అంటుంది. స్వరాజ్ ఎందుకు అలా వారసుడివి అన్నావని అపర్ణ అడుగుతుంది. నువ్వే కదా మొన్న ఈ ఇల్లు నీదన్నావ్.. అందుకే అన్నానని స్వరాజ్ అంటాడు. దాంతో అందరు రిలాక్స్ అవుతారు.

ఆ తర్వాత బాబుని బయటకు తీసుకొని వెళ్లి రాజ్, కావ్య మాట్లాడుతుంటే కనకం వస్తుంది. కనకం, స్వరాజ్ ఫ్రెండ్స్ అయిపోయి రుద్రాణి పని చెప్పాలనుకుంటారు. మరొకవైపు అప్పు, కావ్య ఇద్దరి ప్రెగ్నెంట్ పోవాలని తీర్థంలో ఏదో కలుపుతుంది రుద్రాణి. తరువాయి భాగంలో వినాయకుడికి పూజ చేస్తారు. పంతులు తీర్ధం అందరికి ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.