English | Telugu

Brahmamudi : వాళ్ళిద్దరిని పట్టేసుకున్న ధాన్యలక్ష్మి.. శోభనం గదిలో రాజ్, కావ్య!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -733 లో.....అప్పు, కళ్యాణ్ ల శోభనం కోసం రాజ్, కావ్య ఏర్పాట్లు చేస్తుంటారు. అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలసి కావ్య రాజ్ దగ్గరికి వస్తారు. నేను అర్జెంట్ గా స్టేషన్ కి వెళ్ళాలి. లేదంటే నా జాబ్ పోతుందని అప్పు చెప్తుంది. అందరు కలిసి దానికి సొల్యూషన్ ఆలోచిస్తారు.

అందరు మిమ్మల్ని శోభనం గదిలోకి పంపిస్తారు కదా.. లోపలికి వచ్చాక వెనకాల డోర్ నుండి అప్పు, కళ్యాణ్ వెళ్లిపోండి. మళ్ళీ త్వరగా వచ్చి మీ గదిలో ఉండండి అని రాజ్ చెప్తాడు. దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ ఇద్దరు హాల్లోకి వస్తారు. గదిలో ఉండకుండా అక్కడ ఏం చేస్తున్నారని ధాన్యలక్ష్మి అడుగుతుంది. రెడీ అయ్యాం అలా గార్డెన్ లోకి వెళ్ళామని కళ్యాణ్ అంటాడు. అప్పుని పాల గ్లాస్ తో కళ్యాణ్ దగ్గరికి ఇంట్లో వాళ్ళు పంపిస్తారు. సారీ కళ్యాణ్ నిన్ను బాధపెడుతున్నానని అప్పు అంటుంది. అప్పుడే వెనకాల డోర్ నుండి రాజ్, కావ్య వచ్చి అప్పు కళ్యాణ్ ని బయటకు పంపిస్తారు. అప్పు, కళ్యాణ్ కావ్య గదిలో నగలు పెట్టి మాములు డ్రెస్ లో వాళ్ళు బయటకు వెళ్తారు. అదంతా రాహుల్ చూసి ఇది కదా కరెక్ట్ టైమ్ అని అనుకుంటాడు.

ఆ తర్వాత కళ్యాణ్, అప్పు వెళ్తుంటే దూరం నుండి ధాన్యలక్ష్మి చూసి..కళ్యాణ్ లా ఉన్నాడేంటని అనుకుంటుంది‌. తరువాయి భాగం లో అప్పు, కళ్యాణ్ ఇంటికి వచ్చి ఎవరు చూడకుండా పైకి వెళ్ళాలనుకుంటారు. అప్పుడే ధాన్యలక్ష్మి చూస్తుంది. ఆ తర్వాత అందరు కలిసి రాజ్ కావ్య ఉన్న గదిలోకి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.