English | Telugu

Karthika Deepam2 : నిజం ఒప్పేసుకున్న అనసూయ.. వాళ్ళకి కార్తీక్ చెప్పగలడా!


స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2 ).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -369 లో...దీప తన అసలైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటుంది. దీప అనసూయ దగ్గరికి వెళ్లి.. నా పుట్టుక గురించి చెప్పమని అడుగుతుంది. అనసూయ కంగారు పడుతుంటే దీప కుబేర్ ఫొటో తీసుకొని వచ్చి ఫోటో పై చెయ్ పెట్టి .. ఇప్పుడు నిజం చెప్పమని అంటుంది. దీనికి నిజం ఎవరు చెప్పి ఉంటారు. దీప గురించి ఒక దాస్ కి తప్ప ఎవరికి తెలియదు.. అలా ఎలా చెప్పాడు అని అనసూయ అనుకుంటుంది.

దాంతో అనసూయ ఎమోషనల్ అవుతూ.. కాదే నువ్వు నా తమ్ముడు కూతురివి కాదు వాడికి బస్టాండ్ లో దొరికావు అంట అని అనసూయ చెప్తుంది. దాంతో కార్తీక్ బాబూ చెప్పింది నిజమే అన్నమాట అని దీప అనుకుంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పకని అనసూయ అనగానే.. చెప్పే సిచువేషన్ లో నేను లేనని దీప బాధపడుతుంది.

ఆ తర్వాత దీప గుడికి వెళ్లి దీపo పెడుతుంది. అక్కడికి కార్తీక్ వెళ్తాడు. నిన్ను చూస్తుంటే నీకు క్లారిటీ వచ్చినట్లుందని అంటాడు. అవునని దీప అంటుంది. అనసూయ గారిని అడిగావా అని కార్తీక్ అనగానే.. అవునని దీప అంటుంది. మీరు వెళ్లి జ్యోత్స్న గురించి చెప్పొచ్చు కదా అని దీప అంటుంది. వాళ్ళు అప్పుడు అసలైన వారసురాలు గురించి అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలని కార్తీక్ అంటాడు. చనిపోయిందని చెప్పండి ఒకవేళ నేనే అని తెలిసిన వాళ్ళు ఒప్పుకోరని దీప అంటుంది. దాంతో దీపకి కార్తీక్ నచ్చజెప్పుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.