English | Telugu

Brahmamudi : కావ్యని సర్ ప్రైజ్ చేసిన రాజ్.. రుద్రాణి అతడిని చూస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -707 లో.... కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. రాజ్ రావడం ముందే గమనించిన కావ్య.. అప్పు, అపర్ణల సాయంతో ఇంట్లో అందరిని డైవర్ట్ చేస్తుంది. ధాన్యలక్ష్మి, ఇందిరాదేవిని అపర్ణ గదిలోకి తీసుకొని వెళ్లి చీరలు నగలు అంటూ చూపిస్తుంది. రాహుల్, రుద్రాణిని అప్పు తీసుకొని వెళ్లి రాజ్ కేసు అంటూ చెప్పిందే చెప్తూ డైవర్ట్ చేస్తుంది.

రాజ్ లోపలికి రాకముందే రాజ్ ఎక్కడ తన ఫొటోస్ చూస్తాడోనని గోడ మీదున్న రాజ్ ఫొటోస్ తీస్తుంది కావ్య. రాజ్ లోపలికి రాగానే కావ్య టెన్షన్ పడుతుంది. రండి కిచెన్ చూద్దామని అంటుంది. అదేంటీ అలా కిచెన్ చూపిస్తాను అంటున్నారని అడుగుతాడు. రాజ్ ని తీసుకొని కావ్య కిచెన్ లోకి వెళ్తుంది. మీ వాళ్ళు అంత ఎక్కడ అని రాజ్ అడుగుతాడు. అందరు గుడికి వెళ్లారు.. వాళ్ళు రావడానికి గంట పైనే అవుతుందని కావ్య చెప్పగానే అయితే మనం బాగా మాట్లాడుకోవచ్చన్న మాట అని రాజ్ అంటాడు. ప్రకాష్ హాల్లో కి వస్తాడు. ఎక్కడ రాజ్ ని చూస్తాడో అని కావ్య స్ఫూన్ లు కింద పడేస్తుంది. రాజ్ కింద పడ్డ స్ఫూన్లు తీస్తుంటాడు. ప్రకాష్ కిచెన్ వంక చూసి వీళ్లంతా ఎక్కడ అని కావ్యకి సైగ చేస్తాడు. లోపల గదిలో అని కావ్య చెప్తుంది. ప్రకాష్ వెళ్ళిపోతాడు. రాజ్ స్ఫూన్లు తీసి పైకి లేస్తాడు.

ఆ తర్వాత నాకు అర్జెంట్ అంటు రాజ్ ఇబ్బంది పడుతుంటే కావ్య తన గదిలోకి తీసుకొని వెళ్తుంది. రాజ్ వాష్ రూమ్ వెళ్తాడు. హాల్లో ఎవరైనా ఉన్నారేమోనని కావ్య చూస్తుంది. అప్పుడే రాజ్ వచ్చి మీకు తీసుకొని వచ్చిన సర్ ప్రైజ్ ఎలా ఉంది అనగానే కావ్య ఓపెన్ చేసి చూసేసరికి చీర ఉంటుంది. అది చూసి కావ్య మురిసిపోతుంది. ఇక వెళ్ళండి అని రాజ్ తో కావ్య అంటుంది. రాజ్ కి ఇష్టం లేకున్నా అక్కడ నుండి బయల్దేరతాడు. అప్పుడే రుద్రాణి వాళ్ళు బయటకు వస్తారు. ఎక్కడ రాజ్ ని వాళ్ళు చూస్తారోనని కావ్య డోర్ వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.