English | Telugu

Karthika Deepam2 : గౌతమ్ కాలర్ పట్డుకున్న కార్తీక్.. దీపకి శత్రువులు ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -343 లో.. శౌర్య తన చేతిలో లెటర్ పట్టుకొని దీపని కలవడానికి వెళ్తుంది. ఇంట్లో శౌర్య ఎక్కడ కనిపించకపోవడంతో కార్తీక్ టెన్షన్ పడతాడు. బయటకు వెళ్లి వెతుకుతుంటే శౌర్య కనిపిస్తుంది. వెంటనే తనపై కోప్పడి కార్తీక్ ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళావంటూ కాంచన, అనసూయ అడుగుతారు. అమ్మని కలవడానికి స్టేషన్ కి వెళ్ళాను.. అమ్మ ఎప్పుడు రాదని జ్యోత్స్న చెప్పింది. ఈ లెటర్ చదివితే అమ్మ నా కోసం తప్పకుండా వస్తుందని వెళ్ళానని శౌర్య చెప్తుంటే.. అందరు ఎమోషనల్ అవుతారు.

అమ్మ తప్పకుండా వస్తుంది నేను తీసుకొని వస్తానని శౌర్యకి నచ్చజెప్పుతాడు కార్తీక్. దాంతో శౌర్య కూల్ అయి లోపలికి వెళ్తుంది. ఎప్పుడు ఈ జ్యోత్స్న ఇలాగానే చేస్తుందని కార్తీక్ కోప్పడతాడు. అసలు దీపకి ఇంకా శత్రువులు ఎవరు ఉండి ఉంటారని కార్తీక్ అంటుంటే.. ఇంకెవరు ఆ గౌతమ్ గాడు.. ఇంటికి వచ్చి మరి వార్నింగ్ ఇచ్చాడని కాంచన, అనసూయ చెప్తుంటే కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి గౌతమ్ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడా మరి నాకెందుకు చెప్పలేదని కాంచన, అనసూయలపై కార్తీక్ కోప్పడతాడు. ఇక అనసూయ జరిగింది మొత్తం చెప్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఎవరు ఇదంతా చేసారోనని కార్తీక్ అనుకుంటాడు.

సీన్ కట్ చేస్తే గౌతమ్ ని కార్తిక్ కలుస్తాడు. కాలర్ పట్టుకొని మరి నీలదీస్తాడు. ఆ గన్ పేల్చిచింది నువ్వే కదా అని కార్తీక్ అడుగుతాడు. నీ భార్య షూట్ చేస్తే నన్ను అంటావేంటని గౌతమ్ అంటాడు. నీ భార్య లాగే నువ్వు మా పెళ్లి ఆపాలనుకుంటున్నావా అని గౌతమ్ అంటాడు. అసలు నువ్వు మగాడివి అయితే నీ భార్యని విడిపించుకో అంతే గానీ ఇలా నన్ను అనకు అని గౌతమ్ చెప్పి వెళ్ళిపోతాడు. గౌతమ్ ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే నిజంగానే గౌతమ్ కి తెలియదా ఎవరై ఉంటారని కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.