English | Telugu

Brahmamudi : దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ.. కావ్య సేఫేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -411 లో...రుద్రాణి ఫోన్ మాట్లాడుతుంటుంది. అప్పుడే అనామిక వచ్చి మీతో మాట్లాడాలని అంటుంది. కళ్యాణ్ నేను చెప్పినట్టు వినేలా ఏదైనా ప్లాన్ చెప్పండి అని అనామిక అడుగుతుంది.. ఈ దెబ్బతో గొడవ పెద్దగా అయ్యేలా చెయ్యాలని రుద్రాణి కన్నింగ్ గా అలోచించి... కళ్యాణ్ నీతో సరిగ్గా ఉండడం లేదని మీ వాళ్ళని పిలిపించు.. వాళ్లే వీళ్ళతో మాట్లాడతారు... అప్పుడు ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ కి నచ్చజెప్పుతారని రుద్రాణి అంటుంది..

ఆ తర్వాత కావ్య మాయ కోసం అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తుంది. అక్కడ మాయా ఇల్లు కాళీ చేసి వెళ్ళింది.. వేరొక సొంతిల్లు తీసుకుందని తెలిసి అడ్రస్ వెతుక్కుంటూ మళ్ళీ కావ్య తిరుగుతుంది. ఆ తర్వాత అనామిక తన తల్లికి ఫోన్ చేసి.. ఇప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడండి అని చెప్పగానే వాళ్ళ అమ్మ సరే అంటుంది. మరొకవైపు రాజ్ ని బ్లాక్ మెయిల్ చేసిన అతను రాజ్ కి ఎదురుపడతాడు. అతను భయపడి సర్ నన్నేం అనొద్దు కావ్య గారు నిజం చెప్పమని బెదిరించారు అందుకే చెప్పానని.. రాజ్ ఏం అడుగపోయినా భయంతో చెప్పేస్తాడు. కావ్య ఆ బాబు నా బిడ్డ కాదని తెలిసిపోయిందా అని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత కావ్యకి కావాలనే రౌడీ మనిషి ఎదరుపడి నువ్వు వెతికే అడ్రస్ నాకు తెలుసంటూ తన వెంట తీసుకొని వెళ్తుంది.

మరొకవైపు అనామిక పేరెంట్స్ దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ పెడతారు. మీ అబ్బాయి మా అమ్మయితో ప్రేమగా ఉండడం లేదట అని వాళ్ళు అనగానే... మీ అమ్మాయి భర్తని పోలీస్ స్టేషన్ లో పెట్టింది. తన మనసు విరిగిందని ప్రకాష్, ధాన్యలక్ష్మి అంటారు. ఆఫీస్ కి వెళ్లడం లేదట అని వాళ్ళు అనగానే.. ఎందుకు వెళ్తాడు అతని కవితలు చూసే మీ అమ్మాయి ఇష్టపడింది కదా అని ఇందిరాదేవి తన పేరెంట్స్ కి షాక్ ఇచ్చేలా మాట్లాడుతుంది.. కలపడానికి వచ్చిన వాళ్ళు సైలెంట్ గా వెళ్లిపోండి.. విడగొడదాం అనుకొని వచ్చిన వాళ్ళ వెంట తీసుకొని వెళ్ళండి అని ఇందిరాదేవి తన పేరెంట్స్ కి చెప్తుంది. మరొకవైపు ఇంకా ఆ అడ్రస్ ఎక్కడ అని కావ్య తనతో వచ్చిన ఆవిడని అడుగుతుంది. ఇదిగో ఇక వచ్చేసింది అని ఆవిడా చెప్తుంది. అప్పుడే అప్పు ఫోన్ చేసి నువ్వు చెప్పిన దగ్గరికి వచ్చిన అనగానే.. అయ్యో నేను అక్కడ నుండి వచ్చేసాను.. ప్రెజెంట్ లొకేషన్ పంపిస్తున్నానని అప్పుకి కావ్య లొకేషన్ పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.