English | Telugu

హ్యాపీ బర్త్ డే రా ఎర్రిపప్ప...వెరైటీగా విష్ చేసిన షన్ను


బుల్లితెర మీద సోషల్ మీడియాలో షన్ను, జెస్సి తెలియని వారంటూ ఎవరూ లేరు. నిన్న జెస్సి బర్త్ డే సందర్భంగా షన్ను సడెన్‌గా కేకు పట్టుకొచ్చి జెస్సికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కేక్ పట్టుకురావడం వరకు ఓకే కానీ ...కేకు మీద ఎవరైనా పేర్లు రాయిస్తారు కానీ ఇక్కడ వెరైటీగా ఎర్రిపప్ప అని రాయించాడు షన్ను. "హ్యాపీ బర్త్ డే రా ఎర్రిపప్ప.. మనం కలిసాక ఇది ఫస్ట్ బర్త్ డే కదా.. హౌస్‌లో ఇద్దరం దొరికాంరా మనం ఒకరికి ఒకరు. పద నామినేషన్‌కి వెళ్దామా.. ఇంకా బిగ్‌బాస్‌లోనే ఉన్నావ్ కదా.. బయటికి రారా.." అంటూ జెస్సీని హగ్ చేసుకుని కేక్ కట్ చేయించాడు షన్ను. "తినండి.. షన్ను ప్రేమగా తెచ్చిన కేకు మీ కోసం.." అంటూ నెటిజన్స్ కి కూడా ఒక కేక్ పీస్ పెట్టాడు జెస్సీ.

ఇలా వాళ్లిద్దరూ సరదాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు జెస్సీ.. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మీరు ఇద్దరూ కలిశారు ఓకే కానీ మరి సిరి ఎక్కడ.. వి వాంట్ సిరి , సిరి ఉంటే చాలా బాగుండేది అంటూ కామెంట్లు పెడుతున్నారు. జెస్సీ బర్త్‌డేకి సిరి ఎందుకు రాలేదంటూ జెస్సీని అడుగుతున్నారు. నిజానికి హౌస్‌లో ఉన్నప్పుడు సిరి-షన్ను- జెస్సీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. కానీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి. అందుకే ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కూడా చేసేసుకున్నారు. దీని గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జెస్సీ రియాక్ట్ అయ్యాడు. "వాళ్లు నన్ను ఎందుకు దూరం పెట్టారో నాకు తెలీదు కానీ.. నేనైతే వాళ్లను ఇప్పటికీ ఫ్రెండ్స్‌లానే చూస్తున్నానని" అంటూ ఎమోషనల్ అయ్యాడు జెస్సి. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్దిరోజులకి జెస్సీని సిరి కలిసింది. కానీ షన్ను మాత్రం రాలేదు. ఇప్పుడు కూడా షన్ను-జెస్సీ కలిశారు కానీ సిరి రాలేదు. మరి సిరి వస్తుందా వీళ్ళ ముగ్గురు మళ్ళీ కలుస్తారా..చూద్దాం.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.